వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు.
నాయుడుపేట రెవెన్యూ అధికారుల లీలలు
సూళ్లూరుపేట, న్యూస్టుడే: రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. ఏకంగా సంయుక్త కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను దాచి, దస్త్రాలు కదిలించి చేతివాటం చూపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నాయుడుపేట మండలం బీరదవాడ రెవెన్యూలో సర్వేనంబరు 112/3, 112/4లో 53.74 ఎకరాల భూమి ఉంది. సదరు విస్తీర్ణం వెలగలపూడి ప్రసాదరావు పేరిట పాస్పుస్తకాలు సైతం రెవెన్యూ అధికారులు మంజూరు చేసినట్లు తెలిసింది. వాటిని రద్దు చేయాలని వెలగలపూడి శైలజ.. నాయుడుపేట తహసీల్దార్కు గతేడాది జనవరి 4న వినతపత్రం సమర్పించారు. అప్పటి నుంచి ఇరువర్గాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వైకాపా నేత పాస్పుస్తకాలు రద్దు చేయకుండా పైరవీలు చేశారు. చివరకు దీనిపై సంయుక్త కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన దస్త్రాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి మార్చి 5న సదరు భూముల వివాదం కోర్టులో ఉందని, తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేమంటూ.. దస్త్రాల్లో వివాదాస్పద భూములుగా నమోదు చేయాలని తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి మండల రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో సదరు భూముల్లో క్రయవిక్రయాలు జరిగినట్లు సమాచారం.
కొత్త దస్త్రంగా చేర్చి...
సంయుక్త కలెక్టర్ ఉత్తర్వులిచ్చిన తర్వాత నాయుడుపేట మండల రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూముల జాబితాలో బీరదవాడ రెవెన్యూలోని 53.74 ఎకరాలను చేర్చలేదు. సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉండిపోయారు. ఈలోగా మండల తహసీల్దార్లు బదిలీయ్యారు. కొత్తవారు విధుల్లో చేరారు. ఈ క్రమంలో వెలగలపూడి ప్రసాదరావు పేరిట ఇచ్చిన పట్టాదారు పాస్పుస్తకాలు రద్దు చేయాలని ఫిబ్రవరిలో 5న వెలగలపూడి శైలజ వినతిపత్రం ఇచ్చినట్లు ఓ ఫైలు సిద్ధం చేశారు. దీంతోపాటు ఓ నోట్ఫైలు తయారు చేసి, సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయానికి కొద్ది రోజుల కిందట పంపారు.
ఆర్డీవో పసిగట్టి..
ఫిబ్రవరిలో శైలజ వినతిపత్రమిస్తే.. 147 రోజుల తర్వాత అంటే గత నెల 21న ఆర్డీవో కార్యాలయానికి సంబంధిత ఫైల్ను పంపారు. ప్రస్తుతం నాయుడుపేట తహసీల్దార్గా కల్యాణి పనిచేస్తున్నారు. కానీ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఫైలుపై ఇన్ఛార్జి తహసీల్దార్ రాజేంద్ర సంతకం ఉన్నట్లు తెలిసింది. అన్ని ఫైళ్లతోపాటు బీరదవాడ భూ వివాదం ఫైల్ కూడా రావడంతో ఆర్డీవో చంద్రమునికి అనుమానం వచ్చింది. దీంతో పాటు ఫిబ్రవరి నెల వినతిప్రతం ఇప్పుడు పంపడాన్ని, తహసీల్దార్ సంతకం వేరొకలా ఉండటాన్ని గుర్తించి ఆరా తీశారు. సంయుక్త కలెక్టర్ ఈ ఏడాది మార్చి 5న ఆర్సీ.డీ2/428/2024 కింద ఉత్తర్వులిచ్చిన విషయం వెల్లడైంది. అందులో వివాదాస్పద భూముల జాబితాలో చేర్చాలని పేర్కొనట్లు కూడా గుర్తించారు. దీనిపై వెంటనే నాయుడుపేట రెవెన్యూ అధికారులను ఆర్డీవో ప్రశ్నించినట్లు సమాచారం.
అసోసియేషన్ నేతల ఒత్తిడి
ఆర్డీవో ప్రశ్నించడంతో సదరు ఉద్యోగ సంఘం నేతలు రంగంలోకి దిగారు. ఈ విషయం బయటకు రాకుండా చూడాలని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పంచాయితీ నడిపి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ప్రశ్నించిన తర్వాత చేర్చారు
నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత తేదీలతో కార్యాలయానికి దస్త్రం వచ్చిన మాట వాస్తవం. బీరదవాడలోని 53.74 ఎకరాలను వివాదాస్పద భూముల జాబితాలో చేర్చాలని జేసీ ఆదేశాలను అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించడంతో ప్రస్తుతం చేర్చారు.
చంద్రముని, ఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం