చంద్రకాంతులు కురి‘పింఛెను’
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది.
ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు
మొదటిరోజునే 95.67% నమోదు
రూ..174.49 కోట్ల పంపిణీ
నారాయణవనం: చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం
తిరుపతి (బైరాగిపట్టెడ, భవానీనగర్, నగరపాలిక), న్యూస్టుడే: రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. పెంచిన మొత్తం మూడునెలల బకాయి సహా అందించి వారి జీవితాల్లో అసలైన సంక్షేమ భరోసాకు నాంది పలకడంతో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు. జిల్లా వ్యాప్తంగా 2,69,162 మంది లబ్ధిదారులు ఉండగా సోమవారం రాత్రి ఏడు గంటల వరకు 95.67% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. వీరందరికీ ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద రూ..174.49 కోట్లు సోమవారం పంపిణీ చేశారు మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.
కవితకు మొదటి పింఛన్ అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరణి, మేయర్ శిరీష తదితరులు
తిరుపతి నగరంలో ఉదయం 6:00 గంటలకు 35వ డివిజన్లోని భవానీ నగర్లో దివ్యాంగురాలైన పచ్చిపాల కవితకు మొదటగా పింఛను సొమ్మును అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కమిషనర్ అదితిసింగ్, మేయర్ శిరీష, పార్టీ నేతలు ఎన్వీ ప్రసాద్, మబ్బు దేవనారాయణ రెడ్డి, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేతలు, అధికారుల రాకతో భవాని నగర్లో పండగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. 35వ డివిజన్ అంతటా మామిడి తోరణాలు, అరటి ఆకులతో అలంకరించారు. మేళతాళాలతో సంక్రాంతి వచ్చిందా అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు.
తొట్టంబేడులో పింఛన్ పంపిణీ చేస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి తల్లి బృందమ్మ
మధ్యలో మొరాయించిన సర్వర్లు
ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ నిర్వహించారు. తర్వాత గంటన్నర పాటు సర్వర్లు మొరాయించాయి. దీంతో పింఛన్ల పంపిణీ కాస్త ఆలస్యంగా జరిగింది.
గూడూరు : పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే సునీల్కుమార్
వెంకటగిరి: డయాలసిస్ బాధితుడికి నగదు అందిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణ
తడ: కాదలూరులో పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ
తుమ్మలగుంటలో పింఛను పంపిణీ చేస్తున్న పులివర్తి నాని
తిరుపతి నగరంలో పెంచిన పింఛను తీసుకున్న లబ్ధిదారుల్లో ఆనందం
భవానీ నగర్లో సంగీత వాయిద్యాలతో స్వాగతం
సింగాలగుంటలో మంచానికే పరిమితమైన బాలకృష్ణయ్యకు పింఛను అందజేస్తున్న సిబ్బంది
నగరంలో మైనార్టీ మహిళ సంతోషం..
జీవితంలో మర్చిపోలేను
ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనిది. వేకువజామున ఐదున్నరకే మా ఇంటి తలుపులు తట్టారు. కళ్లు తెరిచిన వెంటనే నా చేతుల్లో పింఛను డబ్బులు పెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడికీ వెళ్లకుండా, ఎటువంటి అవస్థలు పడకుండా నేరుగా మా ఇంటికే పెంచిన పింఛను డబ్బును చేర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లించింది. కుటుంబమంతా ఆనందంగా ఉన్నాం.
పి.కవిత, దివ్యాంగురాలు
నెల సరకులు కొంటాం
వృద్ధాప్య పింఛన్ కింద బకాయితో కలిపి రూ.7వేలు అందింది. ఇంటికి వచ్చి పింఛను డబ్బులు అందించడం చాలా తృప్తినిచ్చింది. నెల మొత్తానికి సరిపడా సరకులు ఈ డబ్బుతో కొనుక్కొని తృప్తిగా మూడుపూటలా తింటాం. మా జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వానికి శతకోటి వందనాలు.
ఆర్.కస్తూరి, మల్లయ్యగుంటకట్ట
ప్రసూతి ఆసుపత్రికెళ్లి అందజేత
తిరుపతి నగరపాలికలోని 39వ డివిజన్ పరిధిలోని చెన్నారెడ్డికాలనీకి చెందిన ప్రత్యేక ప్రతిభావంతురాలు కె.సుజాత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా సదరు వార్డు సచివాలయ పరిపాలన కార్యదర్శి పి.ప్రసూన అక్కడికి వెళ్లారు. ఆమెకు రూ.6 వేల పింఛను సొమ్మును అందజేశారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్న సమయంలో అవసరమైన ఖర్చులకు ఈ సొమ్ము ఎంతో ఉపయోగపడుతుందని సుజాత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వైద్య సేవలకు వినియోగించుకుంటా
పింఛను మాలాంటి పేదల జీవితాల్లో వెలుగునింపింది. హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు రూ.4 వేలకు పెంచడంతోపాటు మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7 అందించడం గొప్ప విషయం. నగదుతో బీపీ, మధుమేహానికి సంబంధించి వైద్యసేవలకు, కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటా.
డి.మునిరామిరెడ్డి, అక్కగార్ల కాలనీ
ఒకేసారి పెంచడం హర్షణీయం
గత ప్రభుత్వం ఏడాదికి రూ.250 చొప్పున పింఛను పెంచి ఇచ్చింది. తెదేపా ప్రభుత్వం ఏకంగా రూ.1000 పెంచడంతోపాటు అవ్వాతాతలకు బకాయితో కలిపి ఇంటివద్దకే ఇచ్చివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నిలపెట్టుకున్నారు. పింఛను నగదు వైద్యసేవలకు, ఇంటి ఖర్చులకు వెచ్చిస్తాం.
ఉషారాణి, చంద్రగిరి
జీవితంలో వెలుగు నింపారు
గతంలో వృద్ధాప్య పింఛను రూ.3 వేలు వచ్చేది. ఇటీవల వయసు మీదపడటంతో పక్షవాతం సోకి కుడికాలు, కుడిచేయి పడిపోయింది. నడవలేని పరిస్థితి. నాకు ప్రత్యేక కోటా కింద పింఛను ఇవ్వాలని విన్నవించా. నిబంధనల మేరకు ధ్రువపత్రం తీసుకురావాలని అధికారులు చెప్పారు. పెంచిన పింఛను నగదు వైద్యసేవలకు సరిపోతుంది.
కృష్ణారెడ్డి, చంద్రగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభినయా.. రోడ్లు
[ 04-07-2024]
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. -
స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి
[ 04-07-2024]
జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. -
ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు
[ 04-07-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్ రూపొందించుకుంది. -
భక్తులకేదీ ఉపశమనం
[ 04-07-2024]
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత
[ 04-07-2024]
తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. -
కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం
[ 04-07-2024]
‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. -
ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
[ 04-07-2024]
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. -
నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
[ 04-07-2024]
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. -
పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
[ 04-07-2024]
పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
[ 04-07-2024]
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. -
వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం
[ 04-07-2024]
రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. -
పథకమేసి.. దోపిడీ చేసి
[ 04-07-2024]
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
[ 04-07-2024]
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం