చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు..
మొదటి రోజే 95 శాతం పంపిణీ
లబ్ధిదారుల్లో సంతోషం
పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రనిధులు, నాయకులు
గోసులకురప్పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు
చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛనుదారులకు స్థానికంగానే పింఛను పంపిణీ చేశారు.ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రి కాగానే పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. పెంచిన నగదు సహా గత మూడు నెలలకు గాను రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు, పింఛను రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు లబ్ధిదారులకి అందజేశారు. ఉదయం నుంచే పంపిణీ జిల్లా వ్యాప్తంగా మొదలైంది. ఎలాంటి సాంకేతిక సమస్య లేకపోవడం, పంపిణీకి అవసరమైన నగదు ముందుగానే సిద్ధంగా ఉంచడంతో పంపిణీ సజావుగా సాగింది. నెలనెలా రూ.3 వేలు పింఛను తీసుకునే వారికి ఒక్కసారిగా రూ.7 వేలు ఇవ్వడంతో వారి అనందానికి అవధుల్లేవు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు మొత్తం 2,71,696 పింఛన్లకు రూ.181 కోట్లు మంజూరు కాగా, సోమవారం సాయంత్రానికి 2,58,112 మందికి(95 శాతం) పంపిణీ చేశారు. మిగిలిన వారికి నేడూ ఇవ్వనున్నారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఉన్న వృద్ధులు పింఛను సొమ్ము తీసుకునేందుకు స్వగ్రామాలకు బయల్దేరారు. చిత్తూరు నుంచి యాదమరి వెళ్లే ఆర్టీసీ బస్సులో అంతా వారే కనిపించారు.
లబ్ధిదారులకు మెగా చెక్కు అందిస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
పలమనేరు: వృద్ధురాలికి పింఛన్ ఇస్తున్న అమరనాథరెడ్డి
రొంపిచెర్ల: వృద్ధులకు పింఛను అందజేస్తున్న తెదేపా ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి తదితరులు
వడమాలపేట: పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్
శాంతిపురం: దివ్యాంగురాలికి నగదు అందజేస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నాయకులు
పెనుమూరు: ఎంపీడీవో కార్యాలయం వద్ద పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే థామస్
పేటమిట్టలో కలెక్టర్ సుమిత్కుమార్తో కలిసి పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్, పక్కనే గల్లా రామచంద్రనాయుడు
పింఛను తీసుకున్న ఆనందంలో మహబూబ్ బాషా
చిత్తూరులో మంచానికే పరిమితమైన దొరైరాజ్కు పింఛను అందజేస్తున్న సచివాలయ సిబ్బంది
ప్లకార్డులు చూపుతున్న తెలుగు మహిళలు
చిత్తూరు నుంచి యాదమరి బస్సులో వెళ్తున్న వృద్ధులు
బయోమెట్రిక్ తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది
పెంచిన సొమ్ము లెక్కించుకుంటున్న వృద్ధురాలు
చంద్రబాబు మా పాలిట దేవుడే...
వైకాపా అధికారంలోకి వచ్చినా రూ.3 వేలు పింఛను ఇవ్వడానికి ఐదేళ్లు పట్టింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను సాయాన్ని రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దనే ఇస్తున్నారు. మాలాంటి వృద్ధులపాలిట చంద్రబాబు దేవుడుగా నిలిచారు.
స్వామినాథన్, ఎన్.జి.చేన్లు గ్రామం, కుప్పం మండలం.
ఆరోగ్య సమస్యలు తీరుతున్నాయి
పెంచిన పింఛన్ మొత్తం రూ.7 వేలు అందుకున్నాను. దీంతో నాకు ఎంతో కాలంగా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడింది. మొదట పింఛన్ పెంచింది కూడా చంద్రబాబునాయుడే. పింఛన్ పెంపుతో సీఎం మా హృదయంలో నిలిచిపోయారు.
రంగప్పశెట్టి, బొమ్మదొడ్డి, పలమనేరు.
తెల్లవారుజామునే అందింది
మాది పేటూరు పంచాయతీ ముచ్చకాలువ గ్రామం మండల కేంద్రానికి 40కిమీ దూరంలో ఉంది. సచివాలయ సిబ్బంది అడవిమార్గంలో వచ్చి తెల్లవారుజూమునే పెంచిన పింఛన్లు రూ.7వేలు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటాం. గతంలో ఎప్పుడు ఇలా ఇవ్వలేదు. పెంచిన పింఛన్లతో బాబు రారాజులా నిలిచిపోతారు.
వాసుదేవనాయుడు, పెద్దబ్బ, ముచ్చుకాలువ గ్రామం
రుణపడి ఉంటా..
అంగ వైకల్యంతో పుట్టా. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నా. ఎక్కడికి వెళ్లాలన్నా చేతుల సహాయంతో నాలుగు కాళ్లపై నడిచినట్లు వెళాల్సిన పరిస్థితి. గతంలో ఇచ్చిన పింఛను అంతగా ఉపయోగపడేది కాదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రెండింతలు పెంచి రూ.6 వేలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మొత్తం నా జీవనానికి సరిపోతుందని భావిస్తున్నా. ఇంత సహాయం చేసిన ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటా.
కాంతమ్మ, గొడుగుమానుపల్లె, పెనుమూరు మండలం
నా జీవనానికి భరోసా లభించింది..
ఒంటరి మహిళను. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు అండ. ఇదివరకు వచ్చే రూ.3 వేలు సరిపోయేది కాదు. ఇప్పుడు ఒకేసారి రూ.7 వేలు ఇవ్వడం, ఇకపై నెలకు రూ.4 వేలు రానుండటంతో హాయిగా జీవిస్తాననే భరోసా లభించింది.
గంగాభవాని, పుత్తూరు
ఇక సమస్యలు లేవు..
వృద్దురాలిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పింఛను మినహా ఏ ఆధారం లేదు. పింఛనుపై ఆధారపడి జీవిస్తున్నా. అనారోగ్యం చేసినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇకేసారి రూ.7 వేలు ఇచ్చారు. ఇకపై నెలనెలా రూ.4 వేలు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.
లక్ష్మమ్మ, జన్నావాళ్లమిట్ట, యాదమరి మండలం
చాలా సంతోషంగా ఉంది..
పింఛను పెరగడం చాలా సంతోషంగా ఉంది. ఖర్చులు పెరగడం, అనారోగ్య సమస్యలు రావడంతో ఇది వరకు వచ్చే పింఛను అంతంత మాత్రమే సరిపోయేది. ఇప్పుడు పెరగడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇవ్వడం చాలా గొప్ప విషయం.
విజయ్గోపాల్, పుత్తూరు
ఇంతకంటే ఇంకేం కావాలి..
ఒంటరి మహిళను. పింఛనే నాకు జీవనాధారం. రూ.3 వేలకే ఇది వరకు మురిసిపోయేదాన్ని. ఇప్పుడు రూ.7 వేలు చేతికందడంతో ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇకపై నెలకు రూ.4 వేలు వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛను పెంచి పేదలకు చాలా సాయం చేశారు. ఇంతకంటే మాలాంటి వాళ్లకు ఇంకేం కావాలి.
వసంతమ్మ, ఒంటరి మహిళ, బొమ్మదొడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభినయా.. రోడ్లు
[ 04-07-2024]
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. -
స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి
[ 04-07-2024]
జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. -
ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు
[ 04-07-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్ రూపొందించుకుంది. -
భక్తులకేదీ ఉపశమనం
[ 04-07-2024]
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత
[ 04-07-2024]
తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. -
కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం
[ 04-07-2024]
‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. -
ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
[ 04-07-2024]
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. -
నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
[ 04-07-2024]
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. -
పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
[ 04-07-2024]
పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
[ 04-07-2024]
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. -
వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం
[ 04-07-2024]
రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. -
పథకమేసి.. దోపిడీ చేసి
[ 04-07-2024]
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
[ 04-07-2024]
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.