భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు.
తితిదే భూములు కార్పొరేషన్కు ధారాదత్తం
పరిహారం లేకుండానే అప్పగింత
ఈనాడు-తిరుపతి
తితిదేకు చెందిన విలువైన భూమిని కార్పొరేషన్కు ఇచ్చిన సామవాయి మార్గం.
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు.
మున్సిపల్ కూరగాయల మార్కెట్ నుంచి తిలక్రోడ్డు మార్గం విస్తరణ కోసం తితిదేకు చెందిన 15 సెంట్ల భూమితోపాటు తిలక్రోడ్డు నుంచి జబ్బార్ లేఅవుట్ ప్రాంతం వరకు 5 సెంట్లు మొత్తంగా 20 సెంట్ల (968 చదరపు గజాలు) స్థలం ఇచ్చారు.
వైఎస్ఆర్ రోడ్డు నుంచి సామవాయి రహదారికి అనుసంధానంగా రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక్కడ ఏకంగా 1.12 ఎకరాలు (5420.8 చ.గ) స్థలాన్ని అప్పగించారు. ఇది శ్రీనివాసం అతిథిగృహానికి సమీపంలో ఉంది. దీన్ని కార్పొరేషన్కు కట్టబెట్టారు. ఇక్కడ ప్రభుత్వ భూమి విలువ రూ.15 కోట్లకుపైనే ఉంటుంది.
ఉదాత్త స్వభావంతో శ్రీవారి భక్తుల అవసరాల కోసం తితిదేకు దాతలు ఇచ్చిన భూములు వైకాపా ప్రభుత్వంలో కార్పొరేషన్కు అప్పనంగా ధారాదత్తం చేశారు. పరిహారం మాట ఎత్తకుండానే రూ.వందల కోట్ల విలువైన భూములను రహదారుల విస్తరణ పేరుతో దోచిపెట్టారు. వైకాపా హయాంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్రెడ్డి అడిగిందే తడవుగా తితిదే ఆస్తులను కార్పొరేషన్కు వై.వి.సుబ్బారెడ్డి కట్టబెట్టారు. కేవలం నాడు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే భక్తుల పేరు చెప్పి వాటిని తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో అసలు ఆయా రహదారుల అవసరం లేకున్నా కేవలం మామూళ్ల కోసమే వీటిని చేపట్టారన్న ఆరోపణలున్నాయి.
తిరుపతి పరిధిలో మొత్తం 18 బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రహదారులను కార్పొరేషన్ చేపట్టింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు కట్టబెట్టిన నాటి కార్పొరేషన్ అధికారులు తితిదే భూములను మాత్రం నిధులు చెల్లించకుండానే తీసుకున్నారు. ఇందుకోసం అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిలు చక్రం తిప్పారు. కేవలం తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు భూమన.. తితిదేకు లేఖలు రాయడం.. ఇందుకు సుబ్బారెడ్డి సైతం ధర్మకర్తల మండలిలో తీర్మానాలు చేసి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. పరిహారం చెల్లించాలని తితిదే ధర్మకర్తల మండలి సైతం కోరకపోవడం గమనార్హం.
విశ్వవిద్యాలయంలో 27.92 ఎకరాలు..
ఎస్వీ విశ్వవిద్యాలయం పరిధిలో బృహత్ ప్రణాళిక రహదారుల కోసం 27.92 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయం నుంచి మూడు రహదారులను నిర్మించాలని భావించారు. నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులు, పూర్వ వీసీలు, అధ్యాపకులు, విపక్షాల నేతలు, పలు విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి గవర్నర్కు సైతం లేఖలు రాయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. లేకుంటే ఇక్కడ విశ్వవిద్యాలయానికి గతంలో తితిదేకు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని రహదారుల నిర్మాణానికి ఇచ్చేందుకు ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. అంటే భూమన అడగడమే ఆలస్యం తితిదే ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి వాటిని కార్పొరేషన్కు అప్పగించారు. చివర్లో భూమిపై హక్కులు కేవలం తితిదేకు మాత్రమే ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఒక్కసారి భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవడం సాధ్యమయ్యేది కాదు. రహదారి నిర్మించిన తర్వాత తితిదే మళ్లీ తమ అవసరాల కోసం మళ్లీ భూములను ఎలా తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!