టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది..
జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి
బానిసలవుతున్న యువత
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే
జిల్లాలో ఇటీవల పట్టుబడిన గంజాయి (పాత చిత్రం)
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. గ్రాముల్లో సరఫరా అవుతున్న సరకు ప్రస్తుతం బస్తాల్లో రవాణా అవుతూ అందరినీ పరేషాన్ చేస్తోంది.. ఇటీవల వీటి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలని స్వయంగా హోంమంత్రి అనిత ఆదేశించినా జిల్లాలో నేటికీ అమలు కాకపోవడం గమనార్హం.
జిల్లాలో గంజాయి సంస్కృతి చాపకింద నీరులా పారుతోంది. చిన్న పిల్లలు సైతం దానికి బానిసలుగా మారుతున్నారు. బస్తాల్లో వస్తున్న నిల్వలను స్థానిక అక్రమార్కులు వాటిని పొట్లాలుగా విభజించి అన్ని మండలాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడి వ్యక్తులు వాటిని చిన్నచిన్న పొట్లాల రూపంలో యువతకు విక్రయిస్తూ ఊబిలోకి నెట్టేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఈ మాయదారి మత్తు విచ్చలవిడిగా విస్తరిస్తున్నా ఏ ఒక్కరూ అడ్డుకట్ట వేయలేకపోయారు. అప్పట్లో వైకాపా నాయకుల అండదండలతో కొందరు బరితెగించి వ్యాపారం చేశారు. వాటికి పోలీసులు పూర్తి సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే.. కొద్దికాలం కిందట చిత్తూరు నగరంలో మాదకద్రవ్యాలపై పోలీసులు దాడులు చేస్తే.. వైకాపా నేత ఒకరు టూటౌన్ పోలీసు స్టేషన్లో పంచాయితీ చేసిన విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ సమయంలో అక్కడి సీఐ, ఎస్సైలు చేతివాటం ప్రదర్శించారని తేలడంతో వారిపై వేటు పడింది. ఇలా పోలీసుల సహకారంతో గంజాయి రవాణా నేటికీ దర్జాగా సాగుతోంది.
ఉలుకూ పలుకు లేదు..
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హోంమంత్రి అనిత గంజాయి అక్రమాలపై ఘాటుగా స్పందించారు. పోలీసులకు గంజాయి నిరోధానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రాత్రి 8 గంటలు దాటిన వెంటనే గుంపులు గుంపులుగా ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, నేరాల నిరోధానికి కృషి చేయాలన్నారు. ఆమె ఆదేశాలతో అన్ని జిల్లాల్లో గంజాయి టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఎక్కడికక్కడ దాడులు మొదలైనా చిత్తూరు జిల్లాలో గంజాయి నిరోధంపై ఉలుకూపలుకూ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
అక్రమ సంపాదన..
వైకాపా నాయకుల అండదండలు.. పోలీసుల సహకారంతో అక్రమ రవాణాతో సంపాదనకు అలవాటుపడిన కొందరు నేటికీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో వైకాపా నేతలకు అంటకాగిన పోలీసులు, కానిస్టేబుళ్లు అదే స్టేషన్లలో ఉండటంతో అక్రమార్కుల పంట పండింది. ఎక్కడా దాడులు, చర్యలు లేకపోవడంతో కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నారు. నేటికీ అక్రమ రవాణా సాగుతుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం విడ్డూరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభినయా.. రోడ్లు
[ 04-07-2024]
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. -
స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి
[ 04-07-2024]
జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. -
ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు
[ 04-07-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్ రూపొందించుకుంది. -
భక్తులకేదీ ఉపశమనం
[ 04-07-2024]
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత
[ 04-07-2024]
తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. -
కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం
[ 04-07-2024]
‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. -
ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
[ 04-07-2024]
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. -
నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
[ 04-07-2024]
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. -
పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
[ 04-07-2024]
పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
[ 04-07-2024]
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. -
వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం
[ 04-07-2024]
రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. -
పథకమేసి.. దోపిడీ చేసి
[ 04-07-2024]
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
[ 04-07-2024]
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్