సుమిత్ మార్క్..!
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు.
గ్రీవెన్స్కు రాని అధికారులకు షాక్
ప్రతి సోమవారం స్వయంగా హాజరు వేస్తానని స్పష్టీకరణ
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. కలెక్టరేట్ సోమవారం జరిగిన గ్రీవెన్స్కు పలు జిల్లా శాఖల అధికారులు హాజరు కాలేదు. కింది స్థాయి అధికారులను పంపడంతో ఆయన గుర్తించి మండిపడ్డారు. ఇకపై ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్కు జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, తానే అటెండెన్స్ వేస్తానని స్పష్టం చేశారు. మండల అధికారులు ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో జరపాలన్నారు. ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం లభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
- గ్రీవెన్స్లో ప్రజల నుంచి 104 అర్జీలు వచ్చాయి. వాటిలో రెవెన్యూ సమస్యలు 81, డీఆర్డీఏ 12, ఇంకా వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.
- సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చు వివరాల్ని ఈ నెల 3లోగా అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శంకర్ప్రసాద్ శర్మ, శ్రీనివాస్ ఖన్నా, రోహన్ ఠాకూర్తో కలిసి ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు, ప్రతిపాదకులతో ఆయన సమీక్షించారు. ఖర్చు వివరాల్ని ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేస్తామన్నారు.
4న కుప్పంలో గ్రీవెన్స్.. కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 4న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో నియోజకవర్గ/మండల స్థాయి అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభినయా.. రోడ్లు
[ 04-07-2024]
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. -
స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి
[ 04-07-2024]
జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. -
ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు
[ 04-07-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్ రూపొందించుకుంది. -
భక్తులకేదీ ఉపశమనం
[ 04-07-2024]
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత
[ 04-07-2024]
తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. -
కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం
[ 04-07-2024]
‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. -
ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
[ 04-07-2024]
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. -
నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
[ 04-07-2024]
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. -
పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
[ 04-07-2024]
పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
[ 04-07-2024]
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. -
వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం
[ 04-07-2024]
రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. -
పథకమేసి.. దోపిడీ చేసి
[ 04-07-2024]
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
[ 04-07-2024]
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
-
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
-
అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఏంటీ వేడుక?
-
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
-
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్
-
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్