logo

నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి

నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 02 Jul 2024 02:59 IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న క్రెడాయ్‌ ప్రతినిధులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక, టీడీఆర్‌ బాండ్లు, వీఎల్‌టీ, ఆర్‌డీపీ తదితర సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు క్రెడాయ్‌ ప్రతినిధులు తెలిపారు. రమేష్, అంకినీడు, రాంబాబు, సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని