వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
లీజుకని తీసుకెళ్లి రూ.70 లక్షలకు అమ్మే యత్నం
గుడిబండ, న్యూస్టుడే: రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ ఎస్కే బాజీ జాన్ సైదా సోమవారం గుడిబండ పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమవేశంలో వివరించారు. రొళ్ల మండలం ఉనసేకుంటకు చెందిన సి.తిమ్మరాజు రూ.70 లక్షలు విలువ చేసే 14 వేరుసెనగ, వరి నూర్పిడి యంత్రాలను లీజుకు తీసుకున్నాడు. ఆరు నెలల నుంచే పూర్వ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలులో ఉన్న రైతు ఉత్పాదక సంఘాలకు వెళ్లి మాయమాటలు చెప్పాడు. నకిలీ చిరునామాతో వారికి కొంత డబ్బు బయానాగా ఇచ్చి వేర్వేరుగా 14 యంత్రాలను లీజుకు తీసుకున్నాడు. అప్పటి నుంచి బాడుగ చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా మోసం చేసి సదరు యంత్రాలను అమ్మకాలకు బేరం మాట్లాడుకొన్నాడు. గుడిబండ మండలం మందలపల్లి శ్రీసిద్ధేశ్వర రైతు ఉత్పాదక సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపి లాగడంతో ఈ మోసం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. గుడిబండ మండలం హిరేతుర్పి ఎస్సీ కాలనీ బస్ స్టాప్ వద్ద అరెస్టు చేసి అతను దాచి ఉంచిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల రైతు సంఘాల సభ్యులు తమ యంత్రాలకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చి పరిశీలించుకోవాని కోరారు. సీఐ రాజ్కుమార్, ఎస్సై మునిప్రతాప్ పాల్గొన్నారు. దర్యాప్తులో సాయ పడిన ఏఎస్సై చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుళ్లు వెంకటేష్, హరినాథ్, బాస్కర్, శివానంద, నరేష్, పాతన్న, మహ్మద్రఫి, హోమ్గాడ్లు జగన్నాథ్నాయక్, చంద్ర, రమేష్, ఉమేష్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభినయా.. రోడ్లు
[ 04-07-2024]
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. -
స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి
[ 04-07-2024]
జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. -
ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు
[ 04-07-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్ రూపొందించుకుంది. -
భక్తులకేదీ ఉపశమనం
[ 04-07-2024]
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత
[ 04-07-2024]
తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. -
కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం
[ 04-07-2024]
‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. -
ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
[ 04-07-2024]
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. -
నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
[ 04-07-2024]
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. -
పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
[ 04-07-2024]
పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
[ 04-07-2024]
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. -
వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం
[ 04-07-2024]
రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. -
పథకమేసి.. దోపిడీ చేసి
[ 04-07-2024]
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
[ 04-07-2024]
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు