పండగ చేద్దాం రండి
జిల్లాలో 2,69,162 మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్ మొత్తం అందుకోనున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తం పెంచడంతోపాటు మూడు నెలల బకాయి కలిపి అందించనున్నారు.
2.69 లక్షల మందికి రూ.182.33 కోట్ల పంపిణీ
ఎన్నికల హామీ అమలుపై హర్షాతిరేకాలు
కూటమి ప్రభుత్వం తొలి సంక్షేమ పండగకు సిద్ధమైంది. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయగా పెంచిన పింఛను మొత్తాన్ని సోమవారం నుంచి అందించనున్నారు. దీంతో పింఛనర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. క్లస్టర్ల వారీగా సచివాలయ సిబ్బంది, లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బట్వాడా చేయనున్నారు. మొదటిరోజే 90% పైగా పంపిణీ పూర్తిచేసే లక్ష్యంతో ఉదయం ఆరుగంటల నుంచే వారు ఇంటింటికీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు పంపిణీ కార్యక్రమం జరగనుంది.
న్యూస్టుడే, తిరుపతి (భవానీనగర్): జిల్లాలో 2,69,162 మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్ మొత్తం అందుకోనున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తం పెంచడంతోపాటు మూడు నెలల బకాయి కలిపి అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, చర్మకారులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ బాధితులు, హిజ్రాలు, కళాకారులు రూ.4000లతోపాటు రూ.3000 చొప్పున మొత్తం రూ.7000 అందుకోనున్నారు. దివ్యాంగులు, కుష్ఠు, వైకల్యం ఉన్నవారికి రూ.6000.. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి, డయాలసిస్ ఇతరత్రా బాధితులకు రూ.10,000 చొప్పున అందజేస్తారు. పక్షపాతంతో మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.15,000 పింఛను మొత్తం ఇవ్వనున్నారు.
50 మంది మించకుండా కేటాయింపు
అర్హుల జాబితా మేరకు సోమవారం ఉదయం నుంచే పంపిణీకి ఏర్పాట్లు సిద్ధంగా చేశాం. మొదటిరోజు సాయంత్రంలోపు అందరికీ ఇంటి వద్దనే అందించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాం. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులు మించకుండా కేటాయించాం. లబ్ధిదారులు ఇళ్లవద్దే ఉండి సహకరించాలి.
ప్రభావతి, డీఆర్డీఏ పీడీ రెండు కాళ్లు విరిగాయి
ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధం కావడం హర్షణీయం. ప్రమాదవశాత్తూ మెట్ల మీద నుంచి కింద పండటంతో రెండు కాళ్లు విరిగాయి. బతుకు పోరాటంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నా. ఈ సమయంలో పెంచిన పింఛన్ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది.
పెంచెల లక్ష్మి, శివజ్యోతినగర్, తిరుపతి
వెన్నుపూస దెబ్బతిని
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ చంద్రబాబు చేసి చూపుతున్నారు. వృద్ధుల పాలిట వరం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల నేతృత్వంలో రాష్ట్ర ప్రగతిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నా. ప్రమాదవశాత్తు ఎడ్లబండి నుంచి కింద పడటంతో వెన్నుపూస దెబ్బతింది. 32 ఏళ్లుగా బాధపడుతున్నా. పెంచిన పింఛన్ మొత్తం చేదోడుగా ఉండనుంది.
రాధాకృష్ణరెడ్డి, అక్కారంపల్లి, తిరుపతి
పోలియోతో బాధపడుతున్నా
చిన్ననాటి నుంచే పోలియో వ్యాధితో బాధపడుతున్నా. కుటుంబ పోషణకోసం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆటో నడుపుతూ కుటుంబ అవసరాలు తీర్చగలుగుతున్నాు. ఈ సమయంలో ప్రభుత్వం పెంచిన పింఛను నా కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
వెంకటేష్, తిరుపతి
కిడ్నీ సమస్యతో..
నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో రెండు పర్యాయాలు డయాలసిస్ చేయించుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో నాలాంటివారి వైద్యఖర్చుల కోసం రూ.10వేలు ఇవ్వడం మరింత మనోధైర్యాన్ని నింపినట్లయింది. ఇంటి వద్దకే వచ్చి అందించడం ఆనందదాయకం.
లోకేష్, సుబ్బారెడ్డినగర్, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్