ఒక్కసారిగా.. ముంచేశారు
తోతాపురి మామిడి కాయల ధర పతనం కొనసాగుతోంది. మామిడి రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. జాక్పాట్ ధర వస్తుందని ఆశించిన రైతులు చివరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
టన్ను రూ.19 వేలకు తగ్గింపు
కుదేలైన మామిడి రైతు
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో అమ్మకానికి వచ్చిన తోతాపురి కాయలు
చిత్తూరు కలెక్టరేట్, బంగారుపాళ్యం, న్యూస్టుడే: తోతాపురి మామిడి కాయల ధర పతనం కొనసాగుతోంది. మామిడి రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. జాక్పాట్ ధర వస్తుందని ఆశించిన రైతులు చివరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. శనివారం టన్ను రూ.21 వేలు పలకగా ఆదివారానికి రూ.19 వేలకు తగ్గింది. రెండ్రోజుల్లో టన్నుకు రూ.5వేల మేర ధర పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలమనేరు, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గ మండలాలోని పలుప్రాంతాల నుంచి రైతులు మామిడికాయలు పలు వాహనాల్లో బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు తెస్తున్నారు. ఈక్రమంలో ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు నిర్వాహకులు వ్యూహాత్మకంగా రాత్రి ఏడు గంటలకు ధర ప్రకటించకుండా ఆపై నిర్ణయిస్తూ రైతులతో దోబూచులాడుతున్నారు. పంట ముంగిపు ద]శలో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలుతోంది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్ అయి ధరలు ఇష్టానుసారంగా తగ్గిస్తున్నా పట్టించుకేనే వారు లేరని రైతులు వాపోతున్నారు. పంట పక్వానికి వచ్చి తోటలో మాగిపోతుండటంతో నిల్వ ఉంచలేని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో గిట్టుబాటు కాని ధరలకు విక్రయించేసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసున్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టరు చర్యలు తీసుకుని గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
కిలో రూ.24 : కలెక్టర్
జులై ఒకటి నుంచి మూడో తేదీ వరకూ జిల్లాలో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కిలోకి రూ.24కు తగ్గకుండా ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆదివారం పండ్ల గుజ్జు పరిశ్రమల యాజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తోతాపురి మామిడికి గతంలో కిలో రూ.30 గిట్టుబాటు ధర నిర్ణయించారన్నారు. ఈ విషయంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించేందుకు రైతులు, పరిశ్రమల యాజమానులతో చర్చించి ధర నిర్ణయించామన్నారు. మూడురోజుల తర్వాత మళ్లీ చర్చించి.. కొత్త ధర ప్రకటిస్తామన్నారు. రైతులు మామిడి పంట నేరుగా గుజ్జు పరిశ్రమల వద్దకు తీసుకెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి, గుజ్జు పరిశ్రమల యజమానులు రాఘవా చాట్లీ, మంజునాథ్, గోవర్ధన్ బాబి, సమీర్, సోము, రైతు నాయకులు నాగేశ్వరరావు, వేణు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ