ఐదేళ్లూ.. ఇలా వదిలేశారు..!
కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లయిపోయిందని తేలిగ్గా చెప్పేశారు మాజీ సీఎం జగన్. ఈ ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఓ నిదర్శనం జిల్లా పరిశ్రమల కేంద్ర భవనం.
నిలిచిన పరిశ్రమల కేంద్ర భవన నిర్మాణ పనులు
ప్రాంగణంలో పెరిగిన పిచ్చిమొక్కలతో కనిపించని భవనం
చిత్తూరు(క్రీడలు), న్యూస్టుడే: కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లయిపోయిందని తేలిగ్గా చెప్పేశారు మాజీ సీఎం జగన్. ఈ ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఓ నిదర్శనం జిల్లా పరిశ్రమల కేంద్ర భవనం. పరిశ్రమల వ్యవహారాల్ని నడిపించే జిల్లా పరిశ్రమల కేంద్రం నూతన కార్యాలయ నిర్మాణ పనులు నిలిచి ఐదేళ్లవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఐదేళ్లలో పనులు ఎక్కడ వేసిన గొంగళి చందాన మారాయి. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ముందస్తు అనుమతులు, స్థాపన తర్వాత పారిశ్రామివేత్తలకు రాయితీలు అందించడంలో జిల్లా పరిశ్రమల కేంద్రం పాత్ర అత్యంత కీలకం. ఇంత కీలకమైన ఈ శాఖ పరిస్థితే ఇలా ఉంటే.. పరిశ్రమల ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా పరిశ్రమల కేంద్ర భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ప్రగతికి కీలకం..
జిల్లా ప్రగతిలో కీలకం పరిశ్రమల శాఖ. అయితే సొంత భవన నిర్మాణం సాకారం కాకపోవడంతో ఇంకా అద్దె భవనంలోనే పాలన సాగిస్తున్నారు. కొత్త భవన నిర్మాణ సమయంలో చిత్తూరులోని సహకార బ్యాంకు పాత కార్యాలయ భవనం నుంచి పాలన సాగించారు. ఆ తర్వాత అక్కడినుంచి మరోచోటకు కార్యాలయాన్ని తరలించారు. కొత్త ప్రభుత్వమైనా శ్రద్ధ తీసుకుని పనుల్ని పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది.
వైకాపా ప్రభుత్వంలో..
జిల్లా పరిశ్రమల కేంద్రం సొంత భవనం చిత్తూరు నగరంలోని ఎస్టేట్లో ఉంది. పాత భవనాన్ని 80వ దశకంలో నిర్మించారు. భవనం గోడలు నెర్రులు చీలడం, పైకప్పు ఉరుస్తుండటం, వర్షపు నీటితో రికార్డు గది తడసిపోతున్న కారణంగా నూతన భవన నిర్మాణం కోసం పనులు చేపట్టారు. రూ.3 కోట్ల అంచనాతో 2018 మార్చి 3న శంకుస్థాపన చేశారు. వేగంగా సాగిన నిర్మాణ పనులు వైకాపా ప్రభుత్వం కొలువుదీరగానే నెమ్మదించాయి. దీంతో మొదటి అంతస్తు వరకు పిల్లర్ల నిర్మాణాలతో పనులు నిలిచి పోయాయి. గోడ ఏర్పాటు ఇప్పటివరకు జరగనేలేదు. ఫలితంగా ఈ భవనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం కారడివిని తలపిస్తోంది. ఇక్కడ పెద్దఎత్తున గుబురుగా వృక్షాలు పెరిగాయి. పాములు తిరుగుతున్నాయి. లోనికి వెళ్లేందుకు జంకుతున్నారు. మొత్తంమీద అక్కడి పరిస్థితి గగుర్పాటు గొలిపేలా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!