అక్రమ క్వారీయింగ్పై చర్యలు తీసుకోవాలి
మండలంలో గత ప్రభుత్వంలో అక్రమంగా కొండల నుంచి తోడేసిన గ్రావెల్ క్వారీపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆదేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్
విజయపురం, న్యూస్టుడే: మండలంలో గత ప్రభుత్వంలో అక్రమంగా కొండల నుంచి తోడేసిన గ్రావెల్ క్వారీపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జమున అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొండల నుంచి గ్రావెల్ మట్టిని అక్రమంగా ఒక సర్వే నంబరులో అనుమతి తీసుకుని మరోచోట మట్టి తవ్వి అక్రమంగా సరిహద్దున ఉన్న తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారన్నారు. ఇందుకు అధికారులు వత్తాసు పలికారని, ఇకపై అలాంటి ఆటలు సాగవన్నారు. అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుంటే వారిపై చర్యలు తప్పవని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడ క్వారీ మైనింగ్ సంబంధించిన లారీలు అక్రమంగా తిరిగితే సీజ్ చేయాలన్నారు. మండల పరిషత్ నిధుల దుర్వినియోగంపై ఉన్న ఫిర్యాదులు విచారించి చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య పరిష్కరించాల న్నారు. డీఎస్పీ నరసింహమూర్తి, ఎంపీడీవో బ్రహ్మయ్య, తహసీల్దారు మల్లికార్జునరావు, జడ్పీటీసీ సభ్యురాలు రేవతి, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను తెదేపా శ్రేణులు ఈ సందర్భంగా సత్కరించాయి.
గ్రామస్థుల నిరసన
పాలసముద్రం, న్యూస్టుడే: నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ క్వారీ, గ్రావెల్ తరలింపును నిలిపి వేయాలంటూ గ్రామస్థులు, యువత నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ పరిధి సరిహద్దులో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్న క్వారీని వెంటనే నిలిపివేయాలని నినదించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం నుంచి తమిళనాడుకు చెందిన వ్యక్తి క్వారీ నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి కొంతమేరకు అనుమతి తీసుకొని కొండలు కూడా కొట్టేశాడని వాపోయారు. రాత్రికిరాత్రి బిల్లులు లేకుండా గ్రావెల్ను తమిళనాడుకు తరలించి లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అనుమతి పత్రాలు చూపాలని అడిగితే బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేలా చూడాలని గ్రామస్థులు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!