రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు కృషి చేస్తున్నారని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో మంత్రి కొలుసు పార్థసారథి
తిరుమల, న్యూస్టుడే: రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు కృషి చేస్తున్నారని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించి, మంచి భవిష్యత్తును ఇవ్వడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి భరోసా కల్పించారని చెప్పారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 కోట్ల పింఛన్ల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తామన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రూ.వెయ్యి పెంచిందని తెలిపారు. వాలంటీర్లపై ప్రభుత్వం ఆలోచించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
తాజా వార్తలు (Latest News)
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు