స్థిరాస్థి క్షేత్రాల్లో వాటాలుగా దోపిడీ
వైకాపా జమానాలో స్థిరాస్థి రంగం కుదేలైంది.. అడపాదడపా వెలిసినా వాటి పేరుతో వసూళ్లపర్వం కొనసాగింది. అటు ప్రజాప్రతినిధులు..
ఐదేళ్లలో పెద్దఎత్తున అనధికార లౌఅవుట్ల ఏర్పాటు
లెక్కలు తేల్చడంలో అధికారులు నిమగ్నం
నాయుడుపేట మండలం విన్నమాల వద్ద..
గూడూరు, న్యూస్టుడే: వైకాపా జమానాలో స్థిరాస్థి రంగం కుదేలైంది.. అడపాదడపా వెలిసినా వాటి పేరుతో వసూళ్లపర్వం కొనసాగింది. అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు అందినకాడికి దోచేశారు. ఇదే అదనుగా ఐదేళ్లలో అధికార పార్టీ అండతో వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు మాయం చేశారు. మామూళ్లు దండుకున్న ప్రజాప్రతినిధులు.. ఇక్కడ మట్టి, గ్రావెల్ తరలింపునకు సహకరించడం గమనార్హం.. అనధికార లేఅవుట్లపై తెదేపా ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తుండటంతో వాటాల లెక్కలు బయట పడుతున్నాయి.
జిల్లాలోని పురపాలికల్లో 277 వెంచర్లను 1,215.15 ఎకరాల్లో విస్తరించారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసే పరిస్థితి లేకపోవడంతో వాటికి నోటీసులు ఇస్తున్నారు. ఈక్రమంలో వెంచర్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అనధికారికంగా అమ్మకాలు చేపట్టగా మిగిలి వాటిని ప్రభుత్వ నిబంధనల మేరకు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
నేతల జేబుల్లోకి.. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వెలిసిన ప్రతి క్షేత్రం ఇక్కడి ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఏర్పాటైంది.వెంచర్లలో వాటాలు లేదా.. మామూళ్లు ఇవ్వందే దస్త్రం కదిలేది కాదని ఆ పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. అధికారిక వెంచర్ల మాటున రూ.కోట్లు చేతులు మారినట్లు.. పెద్దఎత్తున స్థలాలు పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎన్నికల సమయంలో బెదిరింపులు.. శ్రీకాళహస్తి ప్రతినిధి స్థిరాస్తి వ్యాపారంలో రాటుదేలిన వ్యక్తి కాగా అంతా ఆయన గుప్పెట్లోనే ఇక్కడ వెంచర్లు వెలిశాయి. ఐదేళ్లలో రూ.కోట్లలో కూడబెట్టి ఎన్నికల్లో వ్యయం చేశారు. ఎన్నికల్లో స్థిరాస్తి వ్యాపారులను బెదిరించిన నేతలు వారితో రూ.కోట్లు ఖర్చు చేయించారు.
ముందే మాట్లాడుకుని.. : సూళ్లూరుపేట పురపాలక సంఘంలో మూడో వార్డులో విచ్చలవిడిగా వెంచర్లు ఉన్నాయి. ఇందులో 291 ప్లాట్లతో వెలసిన 17 ఎకరాల వెంచర్ ఉండటం గమనార్హం. ఓ స్థిరాస్తి క్షేత్రం వైకాపా నేతది కాగా సదరు నేతకు నోటీసు వెళ్లడంతో అంతా ముందే మాట్లాడుకున్నాం.. మళ్లీ ఇదేమిటి.. అంటూ అధికారులపై ఆగ్రహించడం వంతైంది. గూడూరు పోటుపాళెం పంచాయతీలో 26 అనధికార స్థిరాస్తి క్షేత్రాలు వెలిశాయి. ఇందులో 227 ప్లాట్లలో 15.91 ఎకరాలు, 88 ప్లాట్లు వేసిన మరో వెంచర్ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
[ 03-07-2024]
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. -
సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
[ 03-07-2024]
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. -
రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్
[ 03-07-2024]
పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
కార్యాలయం దాటితే ఒట్టు..!
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు. -
దారి మార్చిన దుంగల దొంగలు
[ 03-07-2024]
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. -
జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!
[ 03-07-2024]
జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రైతు సంక్షేమానికి అడుగులు
[ 03-07-2024]
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. -
వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం
[ 03-07-2024]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు. -
రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
[ 03-07-2024]
తిరుపతి మాస్టర్ప్లాన్ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. -
వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
[ 03-07-2024]
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. -
99.07% మందికి.. పింఛన్ల పంపిణీ
[ 03-07-2024]
పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. -
వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..
[ 03-07-2024]
రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. -
మారని తీరు..
[ 03-07-2024]
తిరుమల బైపాస్ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్ నిర్వాకం పునరావృతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్