logo

‘పెద్దిరెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలి’

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని జిల్లా బహిష్కరణ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 01 Jul 2024 01:36 IST

విలేకరుల సమావేశంలో తెదేపా నాయకులు 

చిత్తూరు(జిల్లా పంచాయతీ) : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని జిల్లా బహిష్కరణ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక తెదేపా కార్యాలయంలో వారు మాట్లాడారు. రాజ్యాంగం గురించి మిథున్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పెద్దిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఐదేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని, రెండువేల మందిపై కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని