logo

మద్యం తాగొద్దని భార్య మందలించడంతో ఆత్మహత్య

మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతున్న భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.

Published : 01 Jul 2024 01:35 IST

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతున్న భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దపంజాణి పంచాయతీ భద్రాచలం గ్రామానికి చెందిన షబానాను చౌడేపల్లె మండలం కోటూరుకు చెందిన ఇమ్రాన్‌(29) అయిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరు భద్రాచలం గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య నిత్యం మందుతాగి వస్తావని గట్టిగా నిలదీసింది. దీంతో అవమానంగా భావించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం గ్రామ సమీపంలోని చలమంగళం మార్గంలోని కౌండిన్య ఉపనదిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్టేషన్‌ హౌస్‌ అధికారి మురళిరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని