చెప్పేది శ్రీసిటీ.. చేసేది లూటీ
తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులోని పారిశ్రామిక నగరం శ్రీసిటీ పేరుతో మట్టి దోపిడీ అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం మారినా.. మట్టి అక్రమరవాణా మాత్రం ఆగలేదు.
అధికారం మారినా ఆగని మట్టి అక్రమ రవాణా
తెర వెనుక కడప మార్క్
శ్రీసిటీ పరిధిలో చెరువులో చేపడుతున్న మట్టితవ్వకాలు
సత్యవేడు, వరదయ్యపాళెం, న్యూస్టుడే: తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులోని పారిశ్రామిక నగరం శ్రీసిటీ పేరుతో మట్టి దోపిడీ అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం మారినా.. మట్టి అక్రమ
రవాణా మాత్రం ఆగలేదు. సత్యవేడు, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో శ్రీసిటీ పేరుతో మట్టిరవాణాకు తెరదీశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కడపకు చెందిన సీఎం బంధువు పేరుతో మూడేళ్లుగా యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణాను సాగించిన ఆ విక్రమార్కుడు, ప్రస్తుతం అధికారం మారడంతో తాను తెర వెనుక ఉంటూ తెరముందు శ్రీసిటీ పెద్దల సాయంతో మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం ఇటీవల మల్లావారిపాళెం(వెస్ట్)లో వెలుగు చూసింది.
పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యాపారులకు
నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినా శ్రీసిటీలోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతోంది. శ్రీసిటీ పరిశ్రమలతోపాటు, శ్రీసిటీ పరిసరాల్లో భూములకు గిరాకీ దృష్ట్యా రియల్ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విలాస హోటళ్లు వంటి వ్యాపార భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే అదునుగా వాటి భూ అభివృద్ధిపనులకు మట్టి అవసరం కావడంతో అనుమతుల్లేకుండా చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని కొల్లగొట్టి అక్రమరవాణా చేస్తూ, ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. శ్రీసిటీ కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తడ, తమిళనాడు పరిధిలో సరిహద్దు ప్రాంతాలైన ఆరంబాకం, మాదరపాకం ప్రాంతాలలో రియల్ఎస్టేట్ వ్యాపారాలకు, బహుళ అంతస్తుల భవనాలు, ఇతర వ్యాపార భవనాలకు మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టి అక్రమ రవాణాను, తవ్వకాలను నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
రక్తం మరిగిన పులిలా.. మట్టిని వదలని విక్రమార్కుడు
వైకాపా హయాంలో సీఎం బంధువు తాలూకా వ్యక్తి సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లోని ప్రభుత్వ భూములు, చెరువులను ఇష్టానుసారంగా కొల్లగొట్టి తమిళనాడుకు తరలించారు. అప్పట్లో సీఎం సోదరుడు అవినాష్రెడ్డి బంధువనే కారణంతో అధికారులు అక్రమరవాణా వైపు కన్నెత్తి చూడటానికి భయపడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో తన వ్యాపారాన్ని కొనసాగించడానికి కొత్త వ్యూహానికి తెరదీశారు. నాడు సీఎం బంధువుగా ఇక్కడ అందరికీ సుపరిచితుడైన విక్రమార్కుడు శ్రీసిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కీలక పదవిలో ఉన్న ప్రముఖవ్యక్తితో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని, ఇరువురూ ఉమ్మడిగా ఇక్కడ మట్టి వ్యాపారాన్ని కొనసాగించారు. సత్యవేడు మండలం మల్లావారిపాళెం(వెస్ట్)లో ఇటీవల చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
అనుమతులు లేకుండా మట్టితవ్వితే చర్యలు
శ్రీసిటీలోగాని మరెక్కడా చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. శ్రీసిటీ పధిలోని చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు భూగర్భ గనులశాఖ అధికారులతో కలిసి తవ్వకాలను అడ్డుకున్నాం.ఎక్కడైనా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
రామాంజనేయులు, తహసీల్దార్, సత్యవేడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రకాంతులు కురి‘పింఛెను’
[ 02-07-2024]
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
[ 02-07-2024]
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. -
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
[ 02-07-2024]
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు. -
టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
[ 02-07-2024]
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. -
ఆగిన ఆన్లైన్ సేవలు
[ 02-07-2024]
ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్(టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. -
సుమిత్ మార్క్..!
[ 02-07-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. -
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి
[ 02-07-2024]
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు
[ 02-07-2024]
ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. -
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ..
[ 02-07-2024]
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. -
వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
[ 02-07-2024]
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం