నాడు రావని.. నేడు వచ్చేస్తాయని
గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని పనులు చేసినా బిల్లులు తీసుకోవడం కష్టమని భావించారు వైకాపా నేతలు. దీంతో 2018లో టెండరు దక్కించుకున్న నేతలు 2019లో అగ్రిమెంటు చేసుకున్నా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని కొనసాగించారు.
సద్దికూడుమడుగులో వైకాపా గుత్తేదారుల దోపిడీ
దువ్వ ఇసుకతో పనులు
నాగలాపురం, న్యూస్టుడే
వంతెన వద్ద సిమెంటు పూత దెబ్బతినడంతో కనిపిస్తున్న వాగులోని ఎర్ర ఇసుక
గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని పనులు చేసినా బిల్లులు తీసుకోవడం కష్టమని భావించారు వైకాపా నేతలు. దీంతో 2018లో టెండరు దక్కించుకున్న నేతలు 2019లో అగ్రిమెంటు చేసుకున్నా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని కొనసాగించారు. తెదేపా పాలనలో రైతాంగం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారని గుర్తెరిగిన వైకాపా నేతలు తాము గతంలో పొందిన పనుల్లో ప్రస్తుతం వేగాన్ని పెంచారు. చెరువుల ఆధునికీకరణ, కట్ట పటిష్టీకరణ వంటి పనులు త్వరితగతిన చేస్తున్నారు. 60 ఎంసీఎఫ్టీల సామర్థ్యంతో అధికారికంగా 900 ఎకరాల ఆయకట్టు, అనధికారికంగా మరో 300 ఎకరాల ఆయకట్టుకు ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న ఈ చెరువు ఆధునికీకరణలో జరుగుతున్న గుత్తేదారు తీరుతో విలువైన జైకా నిధులు పక్కదారిపడుతున్నాయి.
రైతులకు ఉపయుక్తమైన పనులను త్వరగా చేయడం ఆశాజనకమే అయితే పనుల్లో నాణ్యతను వైకాపా నేతలు పూర్తిగా విస్మరిస్తున్నారు. నాగలాపురం మండలంలోని సద్దికూడుమడుగుకు రూ.2.25 కోట్ల అంచనాతో పనులను కేటాయించారు. చెరువు కట్ట పటిష్ఠం, కలుజు నిర్మాణం, వంతెన, సిమెంటు కాలువల నిర్మాణం చేయాల్సి ఉంది. చెరువు కట్ట ఎత్తును పెంచడానికి గ్రావెల్ కట్టపై వేసి క్యూరింగ్, రోలింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులకు నాణ్యమైన గ్రావెల్ను తీసుకురావాల్సి ఉండగా.. గుత్తేదారు కట్ట పక్కనే ఉన్న చెరువు కాలువలోని పెద్ద రాళ్లతో ఉన్న మట్టిని తరలిస్తున్నారు. రాళ్లు కనబడకుండా ప్రస్తుతం చెరువులోని మట్టితో కప్పేస్తున్నారు. నూతన కలుజు నిర్మాణం పక్కనబెట్టి పాత కలుజుపైనే సిమెంటు తాపడం చేస్తున్నారు. వంతెన నిర్మాణంలో ఇసుక స్థానంలో దువ్వఇసుక, ఎర్ర ఇసుకతోనే పనులు చేస్తున్నారు. ఇప్పటికే కొంత దెబ్బతింది. సిమెంటు కాలువల వద్ద పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకునేలా సిమెంటు కాలువల అంచుల వెంబడి మట్టేసి కనబడకుండా చేయిస్తున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ ఏఈ మురళీ మోహన్ను వివరణ కోరగా.. ఫిర్యాదులు పరిశీలిస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పరీక్షలు చేశాకే బిల్లులు చెల్లిస్తామన్నారు.
కట్టపై బండరాళ్లు కనబడకుండా పోసిన చెరువు మట్టి
ఎందరికి చెప్పినా ఫలితం లేకపోయింది..
సద్దికూడుమడుగు వద్ద కట్ట పనులకు బండరాళ్లను వినియోగించారు. ఈ రాళ్లు కనబడకుండా మట్టిని పోస్తున్నారు. గుత్తేదారును నిలదీసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోయింది. వైకాపా నేతల వత్తిళ్లు, ప్రలోభాలకు లోబడి అధికారులు పట్టించుకోవడం లేదు.
గోతాం బలరామయ్య యాదవ్, రైతు, జంబుకేశవపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఫ్లెక్సీలు చించివేత
[ 02-07-2024]
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
[ 02-07-2024]
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు. -
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
[ 02-07-2024]
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’
[ 02-07-2024]
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
[ 02-07-2024]
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. -
టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
[ 02-07-2024]
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. -
ఆగిన ఆన్లైన్ సేవలు
[ 02-07-2024]
ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్(టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. -
సుమిత్ మార్క్..!
[ 02-07-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. -
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి
[ 02-07-2024]
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు
[ 02-07-2024]
ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. -
వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
[ 02-07-2024]
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
-
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
-
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!