logo

శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా ఎస్‌వీఎన్‌ఎస్‌ మూర్తి

శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా ఎస్‌వీఎన్‌ఎస్‌ మూర్తిని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదేశాలు శనివారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరాయి.

Published : 30 Jun 2024 02:14 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా ఎస్‌వీఎన్‌ఎస్‌ మూర్తిని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదేశాలు శనివారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరాయి. ప్రస్తుతం ఈయన తిరుపతి ఆర్జేసీగా విధులు నిర్వహిస్తున్నారు. ముక్కంటి ఆలయ ఈవోగా పని చేస్తున్న ఎస్‌.వి.నాగేశ్వరరావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపధ్యంలో తిరుపతి ఆర్జేసీకి శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని