logo

సర్వదర్శనానికి 18 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు క్యూలైన్‌లో వేచిఉన్నారు.

Updated : 30 Jun 2024 06:29 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు క్యూలైన్‌లో వేచిఉన్నారు. వీరికి దాదాపు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని ఆరు కంపార్ట్‌మెంట్లలో ఉన్నారు. వీరికి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శుక్రవారం శ్రీవారిని 66,256 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.54 కోట్లు హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని