పేరుకే పురపాలికలు.. మార్కెట్లు లేక దైౖన్యం
జిల్లాలోని పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు ఏర్పడి 19 సంవత్సరాలైంది.
ఆరుబయటే మాంసం, చేపల విక్రయాలు
పుత్తూరు: ధర్మరాజుల ఆలయ ఎదురుగా రోడ్డు పక్కన చేపల మార్కెట్
జిల్లాలోని పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు ఏర్పడి 19 సంవత్సరాలైంది. వీటిలో కనీస మౌలిక వసతులు కరవే.. మార్కెట్లు లేక రైతులు రోడ్లపై తాము పండించిన పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. గత పాలకవర్గాలు కనీసం మార్కెట్లకు స్థలాలు సైతం కేటాయించలేదు.. ఈ నేపథ్యంలో రోడ్లపై క్రయవిక్రయాలు చేపడుతుండటంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పుత్తూరు, న్యూస్టుడే: పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు మేజరు పంచాయతీల నుంచి 2005 మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి.. అయితే ఆ మేరకు మౌలిక వసతులు మాత్రం సమకూరలేదు.. ముఖ్యంగా మాంసం, చేపల మార్కెట్ లేక రహదారుల పక్కనే విక్రయిస్తుండటంతో సమస్య నెలకొంది.. ఆదివారమైతే పరిస్థితి మరీ చెప్పనక్కర్లేదు.. పలమనేరులో చేపల మార్కెట్ కోసం రూ.15 లక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పులేదు.
- బహిరంగంగా జంతువధ.. మాంసం విక్రయాలు ఒక ఎత్తయితే.. కొందరు విక్రేతలు రహదారుల పక్కనే జంతువులను వధించడం సమస్యగా మారింది. పుత్తూరు పట్టణంలో కార్వేటినగరం రోడ్డు, ఎన్జీవో కాలనీ, గేటుపుత్తూరు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, నగరిలో ఏకాంబరకుప్పం, నగరి ప్రధాన రహదారి, నగరి-నాగలాపురం రోడ్డు, పలమనేరులో గాంధీనగర్, ప్రధాన రహదారుల్లో ఈ పరిస్థితి ఎక్కువ. వ్యర్థాలను సైతం కాలువుల్లో పడేస్తుండటంతో మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారమైతే ప్రతి వీధి వద్ద ఇదే పరిస్థితి. చేపల మార్కెట్లు తాత్కాలికంగా ఉన్నా ఆయా వీధుల వద్ద ఏర్పాటు చేసి ఆ వ్యర్థాలు అక్కడే వదిలేస్తున్నారు. చేపలను శుభ్రం చేసిన నీరంతా రోడ్డుపైనే పారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
- భూమిపూజ చేసినా.. పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వ హయాంలో చేపల మార్కెట్లు కోసం రూ.15 లక్షల చొప్పున రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఒక్క పలమనేరు మున్సిపాలిటీలో నిర్మాణం చేపట్టారు. పుత్తూరు, నగరిలో తెదేపా హయాంలో భూమిపూజ చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వైకాపా రావడంతో ఆ టెండర్లు రద్దు చేశారు. అనంతరం మరోసారి మంత్రి హోదాలో రోజా భూమిపూజ చేశారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇక మాంసం దుకాణాలు ఎక్కడిపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక దృష్టి సారిస్తాం..
రోడ్లపై ఎక్కడపడితే అక్కడ మాంసం దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రస్తుతం జంతువధశాల లేక ఇలా జరుగుతోంది. త్వరలోనే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు వచ్చిన వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. చేపల మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం జరిగేలా చూస్తాం.
కేఎల్ఎన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, పుత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
[ 02-07-2024]
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు. -
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
[ 02-07-2024]
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’
[ 02-07-2024]
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
[ 02-07-2024]
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. -
టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
[ 02-07-2024]
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. -
ఆగిన ఆన్లైన్ సేవలు
[ 02-07-2024]
ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్(టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. -
సుమిత్ మార్క్..!
[ 02-07-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. -
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి
[ 02-07-2024]
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు
[ 02-07-2024]
ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. -
వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
[ 02-07-2024]
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!