logo

కొత్త బస్సుల ప్రారంభం

చిత్తూరు ఆర్టీసీ రెండో డిపో పరిధిలో రెండు కొత్త బస్సులను శనివారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Published : 30 Jun 2024 02:02 IST

జెండా ఊపి బస్సులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ 

చిత్తూరు (కొంగారెడ్డిపల్లి): చిత్తూరు ఆర్టీసీ రెండో డిపో పరిధిలో రెండు కొత్త బస్సులను శనివారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. చిత్తూరు-బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్, చిత్తూరు-విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సులు ప్రారంభించామని చెప్పారు. అక్కడి ఉద్యోగులు, సంఘ నాయకులతో మాట్లాడగా.. గతంలో చిత్తూరు-2 డిపో పరిధిలో 120 ఆర్టీసీ, 25 అద్దెబస్సులు ఉన్నాయని, అవి వేలూరు-తిరుమల, ఇతర ముఖ్య ప్రాంతాలకు నడిచేవన్నారు. ప్రస్తుతం ఆర్టీసీవి 80, 18 అద్దె బస్సులు ఉన్నాయని, రెండో డిపోకు పూర్వ వైభవం తీసుకురావాలని విన్నవించారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, డీపీటీవో జితేంద్రనాథరెడ్డి, డిప్యూటీ సీఎంఈ నాగేశ్వరరావు, రెండో డిపో మేనేజర్‌ రూపశ్రీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని