పింఛన్ల పండుగకు సన్నద్ధం
ఎన్నికల హామీలు అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి సంతకం చేయగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
జిల్లాకు 2.71 లక్షల మంజూరు
రూ.181 కోట్లు విడుదల
సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పంపిణీ
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: ఎన్నికల హామీలు అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి సంతకం చేయగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.. జిల్లాకు జులై నెలకు 2,71,696 పింఛన్లు.. రూ.181 కోట్లు మంజూరయ్యాయి.. ఈ మొత్తాన్ని ఇప్పటికే సచివాలయ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం దాదాపు పూర్తిచేశారు.. నాలుగో శనివారం బ్యాంకులకు సెలవున్నా పింఛన్ల మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకు అధికారులను ఆదేశించింది.. దీంతో సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వారి పరిధిలోని పింఛన్లకు సంబంధించిన మొత్తాన్ని డ్రా చేసి పంపిణీకి సంబంధించి మ్యాపింగ్ అయిన సిబ్బందికి అందజేయనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ సోమవారం ఉదయాన్నే పింఛన్లు లబ్ధిదారులకు ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే పంచాయతీ, మండల స్థాయి సిబ్బందిని వీటి పంపిణీకి వినియోగించనున్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పాటు, తెదేపా అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తం బకాయిలు కలిపి ఒకేసారి జులైలో ఇస్తామని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. ఈ మేరకు ఒకటో తేదీన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒక్కో నెలకు రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు, జులై నెల పింఛను రూ.4 వేలు మొత్తం రూ.7 వేలు ఒక్కో లబ్ధిదారుకు అందజేయనున్నారు. దివ్యాంగులకు రూ.6 వేలతో పాటు, గత మూడు నెలల బకాయిలు ఇవ్వనున్నారు. ఒకేసారి రెట్టింపు పింఛను నగదు చేతికి అందనుండటంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెదేపా అధికారంలోకి వచ్చాక మొదటిసారి పింఛను పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున పండుగలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ నుండగా, నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయిలో అధికారులు పాల్గొననున్నారు.
జులై నెలకు జిల్లాకు మంజూరు ఇలా..
వృద్ధాప్య పింఛన్లు 1,45,035, వితంతు 59,993, చేనేత కార్మికులు 2,572, దివ్యాంగులు 35,803, అభయ హస్తం 11,311, కల్లుగీత కార్మికులు 561, హిజ్రాలు 32, ఒంటరి మహిళలు 5,761, మత్స్యకారులు 249, డప్పు కళాకారులు 6,290, చర్మకారులు 796, చిత్రకారులు 70, సైనిక సంక్షేమ పింఛన్లు 61, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2,740, డయాలసిస్ రోగులు 422, మొత్తం 2,71,696 మంజూరయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఫ్లెక్సీలు చించివేత
[ 02-07-2024]
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
[ 02-07-2024]
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు. -
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
[ 02-07-2024]
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’
[ 02-07-2024]
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
[ 02-07-2024]
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. -
టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
[ 02-07-2024]
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. -
ఆగిన ఆన్లైన్ సేవలు
[ 02-07-2024]
ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్(టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. -
సుమిత్ మార్క్..!
[ 02-07-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. -
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి
[ 02-07-2024]
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు
[ 02-07-2024]
ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. -
వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
[ 02-07-2024]
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
-
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
-
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!