పర్యావరణాన్ని కబళిస్తున్నా.. విచ్చలవిడి వినియోగం
ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడంలేదు.
పట్టణాల్లో మేటలు వేస్తున్న ప్లాస్టిక్ భూతం
పుంగనూరు, పలమనేరు, న్యూస్టుడే: ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడంలేదు. ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ యథేచ్ఛగా వినియోగంలో ఉంది. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని కబళిస్తోంది. ప్రతి మనిషి నిత్యం సగటున 25-50 గ్రాముల మేర ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించకపోతే ప్లాస్టిక్తో పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి పురపాలికల్లో, చిత్తూరు కార్పోరేషన్లో ప్లాస్టిక్ వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది. హోటళ్లు, దుకాణాలు, మందుల షాపులు, చిల్లరకొట్టుల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు.
తనిఖీలు నామమాత్రమే: మనిషి బయటకు ఖాళీ చేతులతో బయటకు వెళ్లి పండ్లు, కూరగాయలు, తినుబండారాలు మొదలు వస్త్రాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ కవర్లపైనే వినియోగిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమని తెలిసినా పుర అధికారులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమయ్యారు. చిత్తూరు కార్పోరేషన్లో అడపాదడపా తనిఖీలు చేస్తుండగా మిగిలిన పురపాలికల్లో ఈ ఆరు నెలల్లో తనిఖీలు చేపట్టలేదు.
కలిసిపోవాలంటే మూడు దశాబ్దాలు: ప్లాస్టిక్ సంచి భూమిలో కలిసిపోవాలంటే 300 ఏళ్లు పడుతుందని అంచనా. ఫలితంగా వర్షపు నీరు ఇంకడం లేదు. పర్యావరణ వేత్తలు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల క్రితమే 20 మైక్రాన్లలోపు మందం గల ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. తర్వాత 40 మైక్రాన్ల లోపు గల ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులపై నిషేధం విధించింది. జనజీవితంలో భాగమైన ప్లాస్టిక్ సంచుల విక్రయాలు, వినియోగంపై వ్యాపారులు, వినియోగదారులను చైతన్యపరచడంలో పురపాలక అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ప్లాస్టిక్ సంచుల్లో వేడి పదార్థాలు తీసుకెళ్తే ఇథిలిన్, డయాక్సిన్లు వంటి రసాయనాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తాం. ప్రతి కార్పోరేషన్, పురపాలికలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. ప్రజలు సహకరించి వస్త్ర సంచులు, క్యారీ బాక్సులు వినియోగించేందుకు ముందుకు రావాలి.
వీవీఎస్ మూర్తి, ప్రాంతీయ సంచాలకులు, అనంతపురం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రకాంతులు కురి‘పింఛెను’
[ 02-07-2024]
రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. -
చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు
[ 02-07-2024]
పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. -
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
[ 02-07-2024]
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్కు అప్పగించారు. -
టాస్క్ఫోర్సా.. అదెక్కడ..?
[ 02-07-2024]
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. -
ఆగిన ఆన్లైన్ సేవలు
[ 02-07-2024]
ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్(టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. -
సుమిత్ మార్క్..!
[ 02-07-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్ ఇచ్చారు. -
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించాలి
[ 02-07-2024]
నిర్మాణరంగ సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, కోశాధికారి పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు
[ 02-07-2024]
ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. -
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ..
[ 02-07-2024]
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. -
వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్
[ 02-07-2024]
రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!