Crime News: భార్యను నమ్మించి హతమార్చిన భర్త
భర్తతో విడిపోయిన మహిళ అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది.
హత్యకు గురైన భారతి (పాతచిత్రం)
మదనపల్లె నేరవార్తలు, నిమ్మనపల్లె, న్యూస్టుడే: భర్తతో విడిపోయిన మహిళ అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని నాగలకట్ట వీధికి చెందిన రంగయ్య, సాలమ్మల కుమార్తె భారతి (26)కి తొమ్మిదేళ్ల కిందట పలమనేరులోని నాగరాళ్లవీధికి చెందిన గణపతితో వివాహమైంది. వీరికి గంగాధర్ (6), రోహిత్ (4) పిల్లలు. గణపతి అతని కుటుంబ సభ్యులు భారతిని తరచూ వేధింపులకు గురి చేసేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పంచాయితీ చేయగా వారి సమక్షంలోనే గణపతి తన భార్యపై దాడి చేయడంతో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు. రెండు నెలల కిందట పెనుమూరు మండలం కార్తికేయపురంలో ఉన్న చిన్నమ్మ జ్యోతి వద్దకు వచ్చింది. అక్కడ ఆమె నెల్లూరుకు చెందిన రవితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉంటోంది. నెల రోజుల కిందట అతనితో వెళ్లిపోయింది. ఈ నెల 27న గణపతి తన భార్య భారతికి ఫోన్ చేసి బిడ్డలను తాను పోషించలేనని వచ్చి తీసుకెళ్లాలని నమ్మించాడు. దీంతో భారతి బిడ్డలను తీసుకెళ్లేందుకు గురువారం పలమనేరు వచ్చింది. వీరిద్దరు కలసి నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లె వద్ద ఉన్న బాహుదా నది వద్ద గడిపారు. గణపతి పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పొలానికి నీరు కట్టేందుకు వచ్చిన దివిటివారిపల్లెకు చెôదిన మంజునాథ్ అలియాస్ రామాంజులు హత్య చూడటంతో అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మంజునాథ్ను కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రిలో చేర్చారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐలు సద్గురుడు, వల్లిబసు, యువరాజ్, తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు కొంత దూరంలో గొల్లపల్లె వద్ద ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు. శుక్రవారం రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్లి ఆగిపోయింది. మృతురాలి తల్లి సాలమ్మ, తమ్ముడు మునికృష్ణ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకేసు దర్యాప్తునకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి చెప్పారు. ఇప్పటికే హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు చెప్పారు.
ఘటనా స్థలంలో పోలీసు జాగిలంతో తనిఖీలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగ చేద్దాం రండి
[ 01-07-2024]
జిల్లాలో 2,69,162 మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్ మొత్తం అందుకోనున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తం పెంచడంతోపాటు మూడు నెలల బకాయి కలిపి అందించనున్నారు. -
ఒక్కసారిగా.. ముంచేశారు
[ 01-07-2024]
తోతాపురి మామిడి కాయల ధర పతనం కొనసాగుతోంది. మామిడి రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. జాక్పాట్ ధర వస్తుందని ఆశించిన రైతులు చివరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
సోమలలో విషాదం
[ 01-07-2024]
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
శాంతి భద్రతలకు..విఘాతం కలిగించొద్దు
[ 01-07-2024]
పుంగునూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వెళ్లకూడదని, -
82,684 భూహక్కు పత్రాలకు చెల్లు
[ 01-07-2024]
గత వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా అమలు చేసిన శాశ్వత భూహక్కు భూరక్షణ పథక రీసర్వే అభాసుపాలైంది. -
ఐదేళ్లూ.. ఇలా వదిలేశారు..!
[ 01-07-2024]
కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లయిపోయిందని తేలిగ్గా చెప్పేశారు మాజీ సీఎం జగన్. ఈ ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఓ నిదర్శనం జిల్లా పరిశ్రమల కేంద్ర భవనం. -
విద్యుత్తు సమస్యలపై.. ప్రతి బుధవారం వినతుల స్వీకరణ
[ 01-07-2024]
అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం.. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని విద్యుత్తుశాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు -
అక్రమ క్వారీయింగ్పై చర్యలు తీసుకోవాలి
[ 01-07-2024]
మండలంలో గత ప్రభుత్వంలో అక్రమంగా కొండల నుంచి తోడేసిన గ్రావెల్ క్వారీపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అధికారులను ఆదేశించారు. -
విభజన హామీల అమలుకు కలిసి రావాలి
[ 01-07-2024]
‘ఆంధప్రదేశ్లో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి నా అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నామ’ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
రచనతో సమాజాన్ని ప్రభావితం చేయొచ్చు
[ 01-07-2024]
నిజాన్ని భావితరాలకు అందించడంతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఒక్క రచనకే ఉందని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి
[ 01-07-2024]
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు కృషి చేస్తున్నారని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. -
శోత్రీయ భూముల్లో మట్టి దొంగలు
[ 01-07-2024]
చిన్నపాండూరులోని వివాద శోత్రీయ భూముల్లో దొంగలు పడ్డారు. వారెవరో కాదు..మట్టిని కొల్లగొట్టి అక్రమ రవాణా రుచిమరిగిన మట్టి దొంగలు.. -
స్థిరాస్థి క్షేత్రాల్లో వాటాలుగా దోపిడీ
[ 01-07-2024]
వైకాపా జమానాలో స్థిరాస్థి రంగం కుదేలైంది.. అడపాదడపా వెలిసినా వాటి పేరుతో వసూళ్లపర్వం కొనసాగింది. అటు ప్రజాప్రతినిధులు.. -
‘పెద్దిరెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలి’
[ 01-07-2024]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని జిల్లా బహిష్కరణ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ డిమాండ్ చేశారు. -
మద్యం తాగొద్దని భార్య మందలించడంతో ఆత్మహత్య
[ 01-07-2024]
మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతున్న భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు