YSRCP: వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు.
వారి తీరుపై నివేదికలు సిద్ధం
పోటీ చేయడానికి వస్తే కొట్టారు
గూడూరు, న్యూస్టుడే: వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని విర్రవీగారు. ప్రజా ప్రయోజనాలు తోసిరాజని ఫక్తు రాజకీయ నాయకుల్లా చలామణి అయ్యారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా చెలరేగారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. అందినకాడికి దోచేశారు. ఇలా వారి కదలికలపై నిఘా కన్ను ఆరా తీస్తోంది. తెదేపా అధికారంలోకి రావడంతో ఆయా అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. వారి తీరుపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
పురపాలిక ఎన్నికల్లో మరో సీఐ బెదిరింపులు
నాయుడుపేటలో పనిచేసిన మరో సీఐ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను బెదిరించి భయపెట్టారు. పురపాలక ఎన్నికల్లో తెదేపాకు చెందిన బీసీ నేతల మునిరాజాపై వైకాపా నేత కామిరెడ్డి రాజారెడ్డి దాడి చేసి భయపెట్టినా తిరిగి మునిరాజాను బెదిరించిన పరిస్థితి. వైకాపా నేతలు పట్టణంలో హల్చల్ చేసినా ప్రతిపక్ష పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. పోటీ చేస్తే ‘ఖబడ్దార్.. మీపై గంజా కేసులే..’ అంటు భయపెట్టారు. ఇసుక, మట్టి, మాఫియా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. వసూళ్లలో కొంత భాగం నియోజకవర్గ ప్రతినిధి గన్మెన్లు, డ్రైవర్లకు మామూళ్ల ఏర్పాటు చేయించారు.
పసుపు చొక్కా విప్పకుంటే జైలుకే..
వైకాపా నేతలకు అంటకాగిన నాయుడుపేటలో పనిచేసిన ఓ ఎస్సై పురపాలిక ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించారు. ఏకంగా ఎస్సీ నేత దార్ల రాజేంద్రను చొక్కా విప్పించే వరకు వదలిపెట్టలేదు. లేకుంటే జైలుకెళ్తారని బెదిరించారు. స్థానిక ర.భ అతిథిగృహం వద్ద అడ్డుకుని అక్కడి నుంచి ఏకంగా స్టేషన్కు తీసుకెళ్లారు.
‘ఎమ్మెల్యేపైనే పోస్టు పెడతావా’అంటూఎస్సై..
ఓజిలిలో పనిచేసిన ఓ ఎస్సై సూళ్లూరుపేటలో పనిచేసిన సమయంలో హల్చల్ చేశారు. ఆయనకు ఎదురు తిరిగితే కేసులే అన్నట్లు వ్యవహరించారు. ఆయన అక్రమాలు బయట పెట్టిన వైకాపా నేత సునీల్రెడ్డి, బాబురెడ్డిలను బెదిరించి స్టేషన్కు పిలిచి కేసులు పెట్టారు. వారు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం నడిచింది. బాబురెడ్డి ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు బెదిరించి కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
[ 07-07-2024]
దారి సమస్య పరిష్కరించాలని ఓ మహిళ పురపాలక కమిషనర్కు విన్నవిస్తే రాత్రి 9.00 గంటల తర్వాత ఫోన్ చేయాలని చెప్పిన సంఘటన కుప్పంలో చోటుచేసుకుంది. -
పెద్దాయన చెప్పారా... ప్రతిభతో పనేంటి!
[ 07-07-2024]
కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు పేరుకే.. వాటితో పనేలేదు.. ప్రతిభ అంతకంటే అవసరం లేదు.. సిఫార్సు ఉంటే సరే.. అందునా పెద్దాయన చెప్పారా కొలువు ఖాయం! - ఇదీ వైకాపా హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో అడ్డగోలు నియామకాల తీరు. -
పింఛన్ దొంగలు
[ 07-07-2024]
చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన రామస్వామికి గతంలో అవయవ మార్పిడి పింఛను వచ్చేది. అయితే ఆరంచెల తనిఖీల్లో భాగంగా ఆయనకు అసలు అవయవ మార్పిడి జరగలేదని, అనారోగ్యంతో ఉన్న కారణంగా శస్త్ర చికిత్స మాత్రమే చేసినట్లు అధికారులు గుర్తించారు. -
కుప్పానికి విద్యుత్తు బస్సులు
[ 07-07-2024]
గ్రామీణ రోడ్లలోనే కాకుండా.. పట్టణ రోడ్లపైకి వచ్చే బస్సులు కూడా హఠాత్తుగా ఆగుతూ.. మరమ్మతు కోసం గ్యారేజీకి వస్తున్నాయి.. ఇక నుంచి అలాంటి పరిస్థితికి తావుండదు.. రోడ్లపై మరమ్మతుతో బస్సులు ఆగకుండా ఆర్టీసీని ఆదాయ మార్గంలో పయనింపజేస్తామని చిత్తూరు డీపీటీవో జితేంద్రనాథరెడ్డి తెలిపారు.. -
వినాయకా.. పదవి ఎవరికయ్యా?
[ 07-07-2024]
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో ఖాళీగా ఉన్న కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఛైర్మన్ పదవి కోసం పలువురు తెదేపా నాయకులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
మామూళ్లిస్తేనే.. దస్త్రం కదిలేది
[ 07-07-2024]
జిల్లా పట్టు పరిశ్రమశాఖ కార్యాలయం అవినీతిమయంగా మారింది.. అధికారుల పనితీరు ఇష్టారాజ్యంగా తయారైంది.. దస్త్రం కదలాలంటే కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి నగదు ముట్టజెప్పాల్సిందే.. లేకుంటే బుట్టదాఖలే.. పేరుకే జిల్లా పట్టు పరిశ్రమశాఖ అధికారిగా వ్యవహరిస్తున్నారే తప్ప.. -
వాటాలు ముడితేనే పచ్చజెండా
[ 07-07-2024]
రైల్వేలో ప్రగతి పనులు అవినీతికి కేంద్రంగా మారాయి. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వాటాల వసూళ్లు ఆందోళన రేకెతిస్తున్నాయి. సీబీఐ తాజా అరెస్టుల నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. -
యథా జగన్.. తథా నేతలు
[ 07-07-2024]
గత సీఎం జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్న ప్యాలెస్, అందులోని ఫర్నిచర్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో దుబారా అవసరమా అంటూ విమర్శలు గుప్పించారు. -
జిల్లాలో నాలుగు ఇసుక కేంద్రాలు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి నూతన ఇసుక పాలసీ అమలు చేయనున్నట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
2డీ ఎకో మూత.. రోగుల అవస్థలు
[ 07-07-2024]
రుయాలో ఒప్పంద పద్ధతిలో పనిచేసే టెక్నీషియన్ల విధుల కేటాయింపు (రోస్టర్)లో తలెత్తిన విభేదాలతో ఏకంగా 2డీ ఎకో గదినే శనివారం మూసివేశారు. శస్త్రచికిత్సలు, అత్యవసర విభాగం నుంచి పరీక్షల కోసం వచ్చిన రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. -
రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
హంపి మఠాధిపతికి తితిదే చిన్నమర్యాద
[ 07-07-2024]
కర్ణాటకలోని హంపి మఠాధిపతి శ్రీజగద్గురు విద్యారణ్య భారతికి తితిదే చిన్నమర్యాద చేసింది. శనివారం ఉదయం శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద పీఠాధిపతికి తితిదే జేఈవో వీరబ్రహ్మం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ కుటుంబమే కారణం
[ 07-07-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధాన కారకులు వైఎస్ కుటుంబీకులేనని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సూరత్లో కుప్పకూలిన భవనం.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు