అనర్హులకు పింఛన్లు
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది.
వైకాపా ప్రభుత్వంలో అర్హత లేకపోయినా మంజూరు
తప్పుడు సదరం పత్రాలతో సొమ్ము పొందుతున్న వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, ఆత్మకూరు
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమకు అనుకూలమైన వాలంటీర్లను అడ్డంపెట్టుకుని సంక్షేమ పథకాల పేరుతో వైకాపా సానుభూతిపరులకు ప్రజాధనాన్ని దోచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఆసరా పింఛను లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలే ఇందుకు నిదర్శనం. తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమవారం మొదటిసారి పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయడంతో వేలాది మంది అనర్హులు బయటపడ్డారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు రూ.3 వేలు పింఛను అందించారు. వైకల్యం ఎంత ఉందో నిర్ధారించడానికి సదరం శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తించారు. వైకాపా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు వైకల్యం లేకపోయినా ధ్రువపత్రాలు జారీ చేశారు. కొందరు వైద్యులు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసి తప్పుడు పత్రాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు వైద్యులపై చర్యలు తీసుకున్నారు. అనర్హులను ఏరివేసే ప్రక్రియను పూర్తిచేయలేదు.
ఇప్పటికీ వందలాది మంది తప్పుడు సదరం పత్రాలతో పింఛను సొమ్ము తీసుకుంటున్నారు. తెదేపా కూటమి సర్కారు దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తోంది వందలాది మంది తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు సచివాలయ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది.
మగ్గం పని చేయకున్నా..
చేనేత మగ్గం ఎరుగని వైకాపా నాయకులు అధికార బలంతో గత ప్రభుత్వంలో నెలనెలా పింఛన్ సొమ్ము అప్పనంగా మేసేసిన ఉదంతం చెన్నేకొత్తపల్లి గ్రామ సచివాలయం-2 పరిధిలో వెలుగులోకి వచ్చింది. సచివాలయ పరిధిలోని గ్రామాలలో మగ్గం పని చేయకపోయినా తాము చేనేత కార్మికులమంటూ ఐదేళ్లపాటు పింఛన్ సొమ్ము కాజేశారు. సచివాలయం పరిధిలో తొమ్మిది మంది చేనేత పింఛన్లు పొందుతున్నారు. మండల కేంద్రంలో నలుగురికి మాత్రమే మగ్గాలు ఉన్నాయి. వారిలో ఏ ఒక్కరికీ పింఛను రావడం లేదు. చెన్నేకొత్తపల్లి మండలంలో మొత్తం 70కి మించి మగ్గాలు లేవు. 808 మందికి సొమ్ము అందిస్తుండటం గమనార్హం.
కొన్ని ఉదంతాలు..
- రాప్తాడు మండలం మరూరుకు చెందిన వైకాపా నాయకుడు దివ్యాంగ పింఛను పొందుతున్నారు. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైనట్లు ప్రతినెలా రూ.5 వేలు తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఎలాంటి పక్షవాతం లేదు. మొన్నటివరకు వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో సదరు వ్యక్తికి రూ.15 వేలు పింఛను అందించడం గమనార్హం.
- ఆత్మకూరు మండలం పి.యాలేరు, పి.సిద్ధరాంపురం గ్రామాల్లోని వైకాపా సానుభూతిపరులకు అర్హత లేకపోయినా పింఛన్లు మంజూరు చేశారు. భార్యభర్తలు కలిసి ఉన్నప్పటికీ విడాకులు తీసుకున్నట్లు చూపి ఇద్దరూ సొమ్ము పొందడం గమనార్హం. పి.యాలేరులో వయస్సు లేకపోయినా ఆధార్లో మార్పులు చేసి కొందరు పింఛన్లు పొందుతున్నారు.
- గొందిరెడ్డిపల్లికి చెందిన వైకాపా నాయకుడు వైకల్యం ఉన్నట్లు సదరం పత్రం తీసుకుని ప్రతి నెలా రూ.3 వేలు పింఛను అందుకున్నారు. కొత్త ప్రభుత్వం ఆయనకు రూ.6 వేలు పింఛను అందిస్తోంది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోగినేపల్లిలో భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళగా పింఛను పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం అండతో అమిగోస్ అడ్డగోలు దోపిడీ
[ 06-07-2024]
వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అమిగోస్ సంస్థ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. అనంతపురం జిల్లాలో గనులన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని లీజుదారులను చిత్రహింసలకు గురి చేసింది. -
ధర్మవరం టు మంగళూరు..వయా పెనుకొండ
[ 06-07-2024]
పేదల బియ్యం కొందరు పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భూ హక్కుల్లో చిక్కులు.. రైతన్నకు తిప్పలు
[ 06-07-2024]
రాష్ట్రంలో వందేళ్ల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే అంటూ గొప్పలు చెబుతూ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్షణ పథకం పేరుతో ప్రవేశపెట్టిన రీసర్వే రైతులకు పెద్దముప్పు తెచ్చిపెట్టింది. -
తరగతుల విలీనం రద్దు చేయాలని ఆందోళన
[ 06-07-2024]
హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు తమ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
పత్తి తూకాల్లో మోసం
[ 06-07-2024]
మండలంలోని గౌనూరు గ్రామంలో కొంత మంది దళారులు పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోయారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉండాలి
[ 06-07-2024]
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు, కార్మిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికి మేలు జరిగేలా పాలన చేయాలని, వాటి అమలు కోసం కృషి చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. -
గూగూడు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రానివ్వద్దు
[ 06-07-2024]
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. -
భార్య వేధింపులతో భర్త బలవన్మరణం
[ 06-07-2024]
భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేయడంతో భర్త లోహిత్కుమార్(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాత గుంతకల్లులో గురువారం రాత్రి జరిగింది. -
బాస్కెట్బాల్లో అనంత కీర్తి
[ 06-07-2024]
బాస్కెట్బాల్ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిని అందుకుని జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా బాస్కెట్బాల్ సంఘం, ఆర్డీటీ ప్రోత్సాహంతో అనంతపురానికి చెందిన ద్వారకానాథరెడ్డి అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు. -
గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు
[ 06-07-2024]
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో ఉన్న ఏడు బీ-1 గనుల లీజుదారుల నుంచి కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) విజ్ఞప్తులను స్వీకరించింది. -
అంగన్వాడీ ఖాళీ పోస్టులను తేల్చండి: పీడీ
[ 06-07-2024]
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్యను తేల్చాలని ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పదకొండు ప్రాజెక్టుల సీడీపీఓలతో సమీక్ష జరిపారు. -
సెక్టోరియల్.. అడ్డదారుల్!
[ 06-07-2024]
సమగ్రశిక్షా పథకం కార్యాలయంలో కొందరు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు, విద్యాశాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పదవులు చేపట్టారు.