తుంగభద్రకు పెరిగిన వరద
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు.
అన్నదాతల్లో చిగురించిన ఆశలు
తుంగభద్ర ప్రాజెక్టుకు చేరిన వరద నీరు
అనంతపురం (శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వానలు జోరుగా కురుస్తుండటంతో జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. గతనెల 29న 1,819 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో...మంగళవారం ఒక్కసారిగా 13,410 క్యూసెక్కులకు పెరగడం విశేషం. దీంతో హెచ్చెల్సీ ఆయకట్టు అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో కాలువకు నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఈలోపు నార్లు పోసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, దావణగెర, అగుంబే, వంటి ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.909 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ కింద 2.85లక్షల ఎకరాలు ఉంది. ఈదఫా టీబీ డ్యాంకు 172 టీఎంసీలు లభ్యం అవుతాయని అంచనా వేశారు. హెచ్చెల్సీ వాట 26.368 టీఎంసీలు వస్తాయి. కనీసం లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగు చేసేందుకు అవకాశం ఉంది. ఏటా ఖరీఫ్లో తుంగభద్రకు వచ్చే వరద నీరే కీలకం. మరోవైపు జూన్లో సాధారణ వర్షపాతం 61 మి.మీ ఉండగా.. 147.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మరమ్మతు పనులు వేగవంతం
ఇటీవల హెచ్చెల్సీ ప్రధాన కాలువ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు సమీపంలో 112 కి.మీ. వద్ద పనులు పూర్తి చేశారు. డి.హీరేహాళ్ మండలం చెర్లోపల్లి సమీపాన 119.638 కి.మీ. వద్ద యూటీకి మరమ్మతు పనుల్లో వేగం పెంచారు. రానున్న ఐదు రోజుల్లో పని పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే తరహాలో ఉరవకొండ మండలం నింబగల్లు సమీపంలోని 181.100 కి.మీ.వద్ద కాలువ గట్టు తెగిపోయింది. రెండు మూడు రోజుల్లో ఈ పనికి శ్రీకారం చుట్టనున్నారు. నీరు విడుదల చేసే నాటికి ఎంపిక చేసిన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు.
నీటి శుద్ధి ప్లాంటులో పురుగు మందు కలిపిన నలుగురు వైకాపా కార్యకర్తల అరెస్టు
కణేకల్లు, న్యూస్టుడే: కణేకల్లు మండలం తుంబిగనూరు గ్రామంలో నీటి శుద్ధి ప్లాంటులో పథకం ప్రకారమే పురుగు మందు కలిపి.. దురాగతానికి ఒడిగట్టిన ఘటనలో వైకాపాకు చెందిన నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సమాచారాన్ని పోలీసులు మీడియా చెప్పకుండా వాట్సప్ గ్రూపులో పోస్టు చేయడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో గ్రామంలో వైకాపా సర్పంచి ఫణీంద్ర ఆధీనంలో ఉన్న ప్లాంటు నిర్వహణను తమకు అప్పగించాలని గత నెలలో తెదేపా నాయకులు ఎంపీడీఓ గూడెన్నకు విన్నవించారు. తెదేపా నాయకుల ఆధీనంలోకి వెళితే తనకు మర్యాద ఉండదన్న దురుద్దేశంతో సర్పంచి ఇతరులతో కలిసి దురాగతానికి పాల్పడ్డాడు. నెపాన్ని తెదేపాపై నెట్టివేయడానికి గత నెల 14న రాత్రి పురుగు మందు కలిపినట్లు తేల్చారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో కళ్యాణుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, కణేకల్లు ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి.. కేసును ఛేదించాయి. దుశ్చర్యలో ప్రధాన భూమిక పోషించిన ఫణీంద్ర పరారీలో ఉన్నాడని, ఫణీంద్ర తండ్రి టి.తిప్పయ్య, తమ్ముడు టి.ఆనందగౌడ, చిన్నాన్న కొడుకు కొట్రేగౌడతో పాటు తలారి హనుమంతును గ్రామంలోని బస్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం అండతో అమిగోస్ అడ్డగోలు దోపిడీ
[ 06-07-2024]
వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అమిగోస్ సంస్థ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. అనంతపురం జిల్లాలో గనులన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని లీజుదారులను చిత్రహింసలకు గురి చేసింది. -
ధర్మవరం టు మంగళూరు..వయా పెనుకొండ
[ 06-07-2024]
పేదల బియ్యం కొందరు పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భూ హక్కుల్లో చిక్కులు.. రైతన్నకు తిప్పలు
[ 06-07-2024]
రాష్ట్రంలో వందేళ్ల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే అంటూ గొప్పలు చెబుతూ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్షణ పథకం పేరుతో ప్రవేశపెట్టిన రీసర్వే రైతులకు పెద్దముప్పు తెచ్చిపెట్టింది. -
తరగతుల విలీనం రద్దు చేయాలని ఆందోళన
[ 06-07-2024]
హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు తమ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
పత్తి తూకాల్లో మోసం
[ 06-07-2024]
మండలంలోని గౌనూరు గ్రామంలో కొంత మంది దళారులు పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోయారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉండాలి
[ 06-07-2024]
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు, కార్మిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికి మేలు జరిగేలా పాలన చేయాలని, వాటి అమలు కోసం కృషి చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. -
గూగూడు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రానివ్వద్దు
[ 06-07-2024]
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. -
భార్య వేధింపులతో భర్త బలవన్మరణం
[ 06-07-2024]
భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేయడంతో భర్త లోహిత్కుమార్(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాత గుంతకల్లులో గురువారం రాత్రి జరిగింది. -
బాస్కెట్బాల్లో అనంత కీర్తి
[ 06-07-2024]
బాస్కెట్బాల్ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిని అందుకుని జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా బాస్కెట్బాల్ సంఘం, ఆర్డీటీ ప్రోత్సాహంతో అనంతపురానికి చెందిన ద్వారకానాథరెడ్డి అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు. -
గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు
[ 06-07-2024]
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో ఉన్న ఏడు బీ-1 గనుల లీజుదారుల నుంచి కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) విజ్ఞప్తులను స్వీకరించింది. -
అంగన్వాడీ ఖాళీ పోస్టులను తేల్చండి: పీడీ
[ 06-07-2024]
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్యను తేల్చాలని ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పదకొండు ప్రాజెక్టుల సీడీపీఓలతో సమీక్ష జరిపారు. -
సెక్టోరియల్.. అడ్డదారుల్!
[ 06-07-2024]
సమగ్రశిక్షా పథకం కార్యాలయంలో కొందరు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు, విద్యాశాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పదవులు చేపట్టారు.