సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది.
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. నువ్వా..నేనా అన్న రీతిలో రాష్ట్ర స్థాయిలో కొందరు అధికారులు విజయవాడలోనే మకాం వేసి పైరవీ చేస్తున్నారు. ఈ శాఖ జిల్లా ముఖ్య ఇంజినీరు (సీఈ), చిన్న నీటిపారుదల (ఎంఐ) పర్యవేక్షక ఇంజినీరు (ఎస్ఈ) పోస్టులు జూన్ ఆఖరులో ఖాళీ ఏర్పడ్డాయి. ఈ రెండు పోస్టుల్లో శ్రీనివాసులురెడ్డి పని చేస్తూ పదవీ విరమణ పొందారు. సాధారణంగా పదవీ విరమణ పొందే రెండు రోజుల ముందే ఎఫ్ఏసీ బాధ్యతలకు ఎవరికి ఇస్తారన్న దానిపై ముందుగానే తగిన ఉత్తర్వు వెలువడటం ఆనవాయితీ. ఈదఫా మూడు రోజులు గడిచినా ఎవరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే ఉత్తర్వులు రాలేదు. వైకాపా ప్రభుత్వంలో ఎఫ్ఏసీ బాధ్యతలు ఇష్టారాజ్యంగా అప్పగిస్తూ వచ్చారు. అనుభవం, సీనియారిటీతో నిమిత్తం లేకుండా జూనియర్లకు ఉన్నత పదవులు కట్టబెట్టారు. ఇందులోనూ ఒకే సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఒక్కొక్కరిని రెండు మూడు పోస్టుల్లో నియమించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టడానికే ప్రస్తుత తెదేపా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అనుభవం, సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పైరవీలకు విజయవాడలో మకాం..
హంద్రీనీవా, హెచ్చెల్సీ, ఎంఐ ప్రాజెక్టులకు సీఈ ఒకరే ఉంటారు. ఈ పోస్టు ఎంతో కీలకం. ఇప్పటికే ఈ పోస్టు కోసం హెచ్ఎల్సీ ఎస్ఈ రాజశేఖర్ ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఈయనే సీనియర్ ఎస్ఈ. జిల్లాను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈయనకే సీఈ పోస్టు వరించనుంది. ఇతర జిల్లాలను తీసుకుంటే మరొకరికి అవకాశం వచ్చే వీలుంది. ఎంఐ ఎస్ఈ పోస్టు కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. కడపకు చెందిన కమతం శ్రీనివాసులు, హెచ్చెల్సీ డివిజన్ ఈఈ శ్రీనివాసులు, హంద్రీనీవా ఈఈ నారాయణనాయక్.. మధ్య పోటీ నడుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరు ఇద్దరు విజయవాడలోనే మకాం వేసి పైరవీ చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య వేధింపులతో భర్త బలవన్మరణం
[ 06-07-2024]
భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేయడంతో భర్త లోహిత్కుమార్(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాత గుంతకల్లులో గురువారం రాత్రి జరిగింది. -
అధికారం అండతో అమిగోస్ అడ్డగోలు దోపిడీ
[ 06-07-2024]
వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అమిగోస్ సంస్థ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. అనంతపురం జిల్లాలో గనులన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని లీజుదారులను చిత్రహింసలకు గురి చేసింది. -
ధర్మవరం టు మంగళూరు..వయా పెనుకొండ
[ 06-07-2024]
పేదల బియ్యం కొందరు పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భూ హక్కుల్లో చిక్కులు.. రైతన్నకు తిప్పలు
[ 06-07-2024]
రాష్ట్రంలో వందేళ్ల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే అంటూ గొప్పలు చెబుతూ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్షణ పథకం పేరుతో ప్రవేశపెట్టిన రీసర్వే రైతులకు పెద్దముప్పు తెచ్చిపెట్టింది. -
తరగతుల విలీనం రద్దు చేయాలని ఆందోళన
[ 06-07-2024]
హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు తమ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
పత్తి తూకాల్లో మోసం
[ 06-07-2024]
మండలంలోని గౌనూరు గ్రామంలో కొంత మంది దళారులు పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోయారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉండాలి
[ 06-07-2024]
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు, కార్మిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికి మేలు జరిగేలా పాలన చేయాలని, వాటి అమలు కోసం కృషి చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. -
గూగూడు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రానివ్వద్దు
[ 06-07-2024]
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. -
బాస్కెట్బాల్లో అనంత కీర్తి
[ 06-07-2024]
బాస్కెట్బాల్ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిని అందుకుని జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా బాస్కెట్బాల్ సంఘం, ఆర్డీటీ ప్రోత్సాహంతో అనంతపురానికి చెందిన ద్వారకానాథరెడ్డి అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు. -
గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు
[ 06-07-2024]
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో ఉన్న ఏడు బీ-1 గనుల లీజుదారుల నుంచి కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) విజ్ఞప్తులను స్వీకరించింది. -
అంగన్వాడీ ఖాళీ పోస్టులను తేల్చండి: పీడీ
[ 06-07-2024]
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్యను తేల్చాలని ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పదకొండు ప్రాజెక్టుల సీడీపీఓలతో సమీక్ష జరిపారు. -
సెక్టోరియల్.. అడ్డదారుల్!
[ 06-07-2024]
సమగ్రశిక్షా పథకం కార్యాలయంలో కొందరు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు, విద్యాశాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పదవులు చేపట్టారు.