వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది.
రూ.5.45 లక్షలు స్వాహా చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్
శెట్టూరు: ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు, తెదేపా నాయకులు
శెట్టూరు, న్యూస్టుడే: శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. 1వ తేదీ లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని పింఛన్ సొమ్మును ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. లబ్ధిదారులు సమస్యను తెదేపా నాయకులకు తెలపడంతో వారు ఎంపీడీవో నరసింహమూర్తికి మంగళవారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. పెంచిన పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి శనివారం బ్యాంకు నుంచి కార్యదర్శి సెలవులో ఉండటంతో రూ.42.39 లక్షలు వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున డ్రా చేసి నగదును తీసుకొచ్చాడు. ఆ మెత్తాన్ని మిగతా క్లష్టర్లకు ఇచ్చి ఆయన పంచాల్సిన వాటిలో కొందరికి పంపిణీ చేశాడు. శెట్టూరు, బసంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులతో డబ్బు వేరేచోట పెట్టాను వెళ్లి తెస్తాను, వేలిముద్రలు వేయండని మొదటిరోజు నమ్మించడంతో వారంతా వేశారు. మంగళవారం సైతం డబ్బులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వాపోయారు. ఇంకా చాలా మందికి ఇవ్వలేదని ఫిర్యాదు రావడంతో ఎంపీడీవో నరసింహమూర్తి అతడిని కార్యాలయానికి పిలిపించి విచారించారు. తాను రూ. 5.45 లక్షలు వాడుకున్నట్లు మల్లికార్జున ఒప్పుకొని రాతపూర్వకంగా రాసిచ్చాడని ఎంపీడీవో తెలిపారు. ఇదే విషయాన్ని పై అధికారులకు తెలిపామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున అక్రమాలపైన, కాజేసిన సొమ్ము రికవరీకి శెట్టూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ విషయమై ఎస్సై రామ్భూపాల్ను వివరణ కోరగా ఎంపీడీవో ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
రూ.లక్ష నగదుతో మరో ఉద్యోగి..
గుడిబండ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ముతో డిజిటల్ అసిస్టెంట్ పరారైన ఘటన గుడిబండ మండలంలో చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన రవికుమార్ ముతుకూరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. జులై ఒకటిన సోమవారం ఇటికేపల్లిలో 83 మంది లబ్ధిదారులకు పింఛన్ అందించే బాధ్యత అప్పగించి అతడికి రూ.4.68 లక్షల నగదు అందించారు. గ్రామానికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కొందరితో వేలిముద్రలు తీసుకున్నా పడలేదని చెప్పి వారికి నగదు చెల్లించలేదు. ఇంకా కొందరికి పింఛన్ పంపిణీ చేయకుండానే ఉడాయించి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. మంగళవారం లబ్ధిదారులు లబోదిబో మనడంతో గుడిబండ ఈవోఆర్డీ నాగరాజ్ నాయక్ సూచన మేరకు ముతుకూరు పంచాయతీ కార్యదర్శి అరుణ గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి అరుణ మాట్లాడుతూ రికార్డు మేరకు రూ.83,500, అన్ రికార్డు మేరకు రూ.1,04,000 చెల్లించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు రవికుమార్ స్థానిక స్టేషన్ వద్ద హాజరయ్యాడు. ఏఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ రూ.52 వేల నగదు చెల్లించాడని, మిగతా రూ.31,500 మొత్తాన్ని చెల్లించాల్సి ఉందన్నారు. ఫోన్ పే ద్వారా తెప్పించి కడితే పంచాయతీ కార్యదర్శికి అప్పగిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య వేధింపులతో భర్త బలవన్మరణం
[ 06-07-2024]
భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేయడంతో భర్త లోహిత్కుమార్(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాత గుంతకల్లులో గురువారం రాత్రి జరిగింది. -
అధికారం అండతో అమిగోస్ అడ్డగోలు దోపిడీ
[ 06-07-2024]
వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అమిగోస్ సంస్థ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. అనంతపురం జిల్లాలో గనులన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని లీజుదారులను చిత్రహింసలకు గురి చేసింది. -
ధర్మవరం టు మంగళూరు..వయా పెనుకొండ
[ 06-07-2024]
పేదల బియ్యం కొందరు పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భూ హక్కుల్లో చిక్కులు.. రైతన్నకు తిప్పలు
[ 06-07-2024]
రాష్ట్రంలో వందేళ్ల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే అంటూ గొప్పలు చెబుతూ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్షణ పథకం పేరుతో ప్రవేశపెట్టిన రీసర్వే రైతులకు పెద్దముప్పు తెచ్చిపెట్టింది. -
తరగతుల విలీనం రద్దు చేయాలని ఆందోళన
[ 06-07-2024]
హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు తమ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
పత్తి తూకాల్లో మోసం
[ 06-07-2024]
మండలంలోని గౌనూరు గ్రామంలో కొంత మంది దళారులు పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోయారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉండాలి
[ 06-07-2024]
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు, కార్మిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికి మేలు జరిగేలా పాలన చేయాలని, వాటి అమలు కోసం కృషి చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. -
గూగూడు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రానివ్వద్దు
[ 06-07-2024]
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. -
బాస్కెట్బాల్లో అనంత కీర్తి
[ 06-07-2024]
బాస్కెట్బాల్ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిని అందుకుని జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా బాస్కెట్బాల్ సంఘం, ఆర్డీటీ ప్రోత్సాహంతో అనంతపురానికి చెందిన ద్వారకానాథరెడ్డి అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు. -
గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు
[ 06-07-2024]
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో ఉన్న ఏడు బీ-1 గనుల లీజుదారుల నుంచి కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) విజ్ఞప్తులను స్వీకరించింది. -
అంగన్వాడీ ఖాళీ పోస్టులను తేల్చండి: పీడీ
[ 06-07-2024]
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్యను తేల్చాలని ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పదకొండు ప్రాజెక్టుల సీడీపీఓలతో సమీక్ష జరిపారు. -
సెక్టోరియల్.. అడ్డదారుల్!
[ 06-07-2024]
సమగ్రశిక్షా పథకం కార్యాలయంలో కొందరు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు, విద్యాశాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పదవులు చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్