‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి
మడకశిర, న్యూస్టుడే : కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం మడకశిరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2029లో రాహుల్గాంధీ ప్రధాని అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చట్టాలు, రాజ్యాంగంపై భాజపాకు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్నే మార్చాలని అనుకుంటున్నారే, అందుకే ఎక్కువ సీట్లు ఒకే పార్టీకి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. గత ప్రభుత్వంలో ఇది నిరూపితమైందన్నారు. వైకాపా ప్రభుత్వంలో విగ్రహాలు కూల్చారని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి విగ్రహాలు కూల్చడం మంచిది కాదన్నారు. న్యాయం కోసం పోరాడే వారు న్యాయంగా పాలన సాగించాలన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్న సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి అన్ని సాధించుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవంతం కావాలని, రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీˆలతో కూడా మాట్లాడిస్తామని పేర్కొన్నారు. అందరూ కలిసి హక్కులను సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన తల్లి మృతి
[ 05-07-2024]
తొలి కాన్పులోనే (ఇద్దరు మగ, ఓ ఆడ) ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి అస్వస్థతకు గురై మృత్యువాత పడిన ఘటన పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది. -
ఊతమిస్తే.. ఉద్యాన సిరులే..!
[ 05-07-2024]
ఉమ్మడి అనంత జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఉద్యాన పంటల సాగుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగేవి. -
డీఆర్ఎం కార్యాలయంలో సీబీఐ దాడులు
[ 05-07-2024]
గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రబాద్కు చెందిన సీబీఐ అధికారులు గురువారం దాడులు చేశారు. -
ప్రధాన సమస్యలు చర్చకు వచ్చేనా?
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించడానికి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం వేదికగా నిలుస్తుంది. -
ఎమ్మెల్యేను కలిసిన వైకాపా కౌన్సిలర్లు
[ 05-07-2024]
రాయదుర్గం పురపాలక వైకాపా కౌన్సిలర్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును ప్రత్యేకంగా కలవడం చర్చకు దారి తీసింది. -
సరస్వతీ నిలయంలో విజ్ఞాన భాండాగారం
[ 05-07-2024]
పేదరికం చదువుకు అడ్డంకి కారాదని.. ప్రతిభ కలిగిన నిరుపేదల సరస్వతీ బిడ్డల కోసం అధునాతన గ్రంథాలయాన్ని నిర్మించి ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కానుకగా ఇచ్చారు హుండాయ్ ట్రాన్సిస్ కంపెనీ ప్రతినిధులు. -
అంతర్జాతీయ లాక్రోస్ పోటీల్లో భారత్కు రజతం
[ 05-07-2024]
ఉజ్బెకిస్థాన్లో నాలుగు రోజుల పాటు జరిగిన ఏషియన్ మహిళల లాక్రోస్ పోటీల్లో భారత జట్టుకు రజతం లభించింది. -
గిరిజన పాఠశాలలో కొరవడిన భద్రత
[ 05-07-2024]
మారుమూల పల్లెల్లోని గిరిజన బాలికలు ఆర్థిక సమస్య కారణంగా చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పాఠశాలలో వసతి కల్పిస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తోంది. -
తుంగభద్రకు వరద
[ 05-07-2024]
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న శివమొగ్గ, అగుంబె, తీర్థహళ్లి తదితర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. -
భక్తి ముసుగులో పాస్టర్ అసభ్య ప్రవర్తన
[ 05-07-2024]
‘జీవితం సంతోషంగా ఉండాలని మీ తరఫున ప్రార్థనలు చేస్తానని నమ్మబలికిన ఓ పాస్టర్ ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. -
మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దుతో కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
[ 05-07-2024]
మండలంలోని ఛాయాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీని మండల అధికారులు రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM