పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు.
గత ప్రభుత్వ తీరుతో విద్యార్థులకు తప్పని అవస్థలు
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. మరో రెండు పైఅంతస్తులో నిర్మించాల్సి ఉంది. తలుపులు, కిటికీలు సరఫరా పనులను రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుత్తేదారుకు అప్పగించింది. వారు అనేక పాఠశాలలకు కిటికీలు, తలుపులు సరఫరా చేయలేదు. వాటిని అమరిస్తే ఆ గదుల్లో తరగతులు నిర్వహించడానికి వీలుంటుంది.
రుద్రంపేటలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఇది. నాడు-నేడు పథకం కింద పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ నిర్మించారు. గోడలకు రంగులు వేయలేదు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడులకు ఓ ఏజెన్సీకి రంగులు వేసే పనులు కట్టబెట్టారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాల గోడలకు రంగులు వేయడం లేదు. దీంతో పాఠశాలల గదులు, గోడలు అధ్వానంగా ఉన్నాయి.
అనంతపురం విద్య, న్యూస్టుడే: గత వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడులను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేస్తామని ప్రగల్భాలు పలికింది. ఐదేళ్ల పాలనలో ఒక్క పాఠశాలలో కూడా పనులు పూర్తి చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించి 16 రోజులు పూర్తయినా.. నేటికీ బడుల్లో నాడు-నేడు పనులు పూర్తి కాలేదు. అనంతపురం జిల్లాలో నాడు-నేడు పథకం కింద 1,078 పాఠశాలలు ఎంపిక చేసింది. సౌకర్యాల కల్పనకు రూ.386 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. గత ప్రభుత్వం మంజూరు చేసినా రూ.149 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ నిధులు కూడా సకాలంలో విడుదల చేయలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నాడు-నేడు రెండో విడత పథకం 2022లో ప్రారంభించారు. 2024 జులై నాటికి కూడా పూర్తి చేయలేదు. ఇటీవల తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ‘నాడు-నేడు’ను ‘స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్’గా పేరు మార్చింది. ఈ పథకం ద్వారా పాఠశాలలను ప్రగతి పథంలో నడిపిస్తారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ఎంలు సమాచారమిస్తే పూర్తి చేయిస్తాం
పాఠశాలలకు కిటికీలు, తలుపులు రాలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పనులు పూర్తయ్యాయని, కిటికీలు, తలుపులు రాలేదని వారు యాప్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే తెప్పించడానికి చర్యలు తీసుకుంటాం.
శివకుమార్, ఈఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ
బిల్లులు రాక.. నిర్మాణం సాగక
మానిరేవు ప్రాథమికోన్నత పాఠశాలలో రంగులు వేయని అదనపు గదులు
కళ్యాణదుర్గం గ్రామీణం: కళ్యాణదుర్గం మానిరేవు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రెండో విడత నాడు-నేడు కింద ఎంపికైంది. ఆరు తరగతి గదులు ఉండగా, 1-8వ తరగతి వరకు 135 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.22 లక్షలతో రెండు అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. గదుల నిర్మాణం పూర్తి కాగా బండలు, రంగులు ఇంకా వేయలేదు. ఇంకా రూ.6,18,887 సొమ్ము రావాల్సి ఉంది.
దీంతో పనులు ముందుకు సాగడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.