ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి.
రూ.20 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను గాలికొదిలేసిన గత ప్రభుత్వం
ఐదేళ్ల కిందట నిలిచిన ఇండోర్ క్రీడా స్టేడియం పనులు
గుంతకల్లు, న్యూస్టుడే: ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 శాతం లోపు ఉన్న నిర్మాణాలను ఆపివేయాలని ఆదేశించడంతో వాటి పనులను గుత్తేదారులు నిలిపివేశారు.
గుంతకల్లులో 2019లో మైనార్టీ బాలబాలికల ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాల కోసం రూ.18 కోట్లతో గదుల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ అనంతపురం నుంచే శంకుస్థాపన చేశారు. పనులు జరుగుతుండగా వైకాపా ప్రభుత్వమే పనులను నాలుగు సంవత్సరాల కిందట ఆపివేసింది. ఇక తెదేపా హయాంలో పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2 కోట్లతో 2018లో ఇండోర్ క్రీడా స్టేడియం పనులు చేపట్టింది. ఈ పనులను కూడా వైకాపా ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందట ఆపివేసింది.
అర్ధాంతరంగా ఆగిన రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు
నిర్మాణాలు ఉంటాయో.. కూలుతాయో!
పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాల, ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణాలు ఉంటాయో కూలుతాయో తెలియని పరిస్థితికి చేరుకున్నాయి. ఇండోర్ స్టేడియం లోపల రకరకాల చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. ఫలితంగా గోడలు కూలిపోతాయేమోనని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. పనులు పూర్తిచేసిన తరువాత బిల్లులు చెల్లించకపోతే తాము అప్పులపాలు అవుతామేమోనని భయపడి గుత్తేదారులు పనులను పూర్తిచేయడానికి సాహసించడం లేదు. గుంకతల్లులోని క్రీడాకారులు వివిధ క్రీడలను ఆడటానికి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులను పూర్తిచేయాలని క్రీడాకారులు, రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను త్వరగా పూర్తిచేసి తమ పిల్లలను ఆదుకోవాలని మైనార్టీలు కోరుతున్నారు.
భవనాలు పూర్తి చేసేందుకు చొరవ
మున్సిపాలిటీలో చేపట్టి అర్ధాంతరంగా ఆపివేసిన రెసిడెన్షియల్ పాఠశాల, ఇండోర్ క్రీడా స్టేడియంల నిర్మాణాలను పూర్తిచేసే విధంగా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళతాం. పనులు విద్యార్థులు, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం.
భవాని, మున్సిపల్ అధ్యక్షురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య!
[ 03-07-2024]
ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. -
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు
-
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..
-
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు: కేటీఆర్