రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు.
కరోనా తర్వాత పలు రైళ్ల నిలిపివేత..
నేటికీ పట్టాలెక్కించేందుకు మీనమేషాలు
అనంతవాసులకు కష్టాలు
విజయవాడ ప్యాసింజర్ (పాతచిత్రం)
అనంతపురం(రైల్వే): కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లను మొన్నటి దాకా ప్రత్యేక ప్యాసింజర్లుగా నడపటంతో ఛార్జీలు ఎక్స్ప్రెస్ తరహాలో వసూలు చేశారు. వాటిని కూడా ఇటీవల సాధారణ ఛార్జీలుగా మార్పు చేశారు. ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకటి, రెండు రైళ్లు ఇప్పటికీ నడవక అనంత రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికీ ప్రారంభించని ప్యాసింజర్..
బెంగళూరు దండు-విజయవాడ ప్యాసింజర్ (53506/07) రైలు ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కరోనా తర్వాత ప్యాసింజర్ రైలు మాత్రం నడవటం లేదు. తొలుత రైల్వే అధికారులు డబ్లింగ్ పనుల తర్వాత నడుపుతామన్నారు. ఆ తర్వాత ఆ రైలును మరచిపోయారు. ఈ రైలు ఉదయం 8 గంటలకు బెంగళూరులో బయలుదేరితే అనంతపురం, గుత్తి, గుంతకల్లు, డోన్, నంద్యాల మీదుగా విజయవాడకు ఉదయం 6 గంటలకు చేరుకునేది. అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రైలులోనే వారాంతాల్లో వెళ్లే వారు. ఎక్కువ ప్రయాణ సమయం ఉన్నప్పటికీ తక్కువ ధరతో విజయవాడకు తీసుకెళ్లే రైలు కావడం, జిల్లాలో పగటి వేళలో నడుస్తూ ప్రతి చిన్న రైల్వే స్టేషన్లోనూ ఆగుతూ వెళ్తుండటంతో గ్రామీణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 7 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు అనంతపురానికి చేరుకొని బెంగళూరు వెళ్లేది. దీంతో పగటి వేళలో బెంగళూరు వైపు వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది. ఈ సమయంలో ఇతర రైళ్లు లేకపోవడంతో విజయవాడ ప్యాసింజర్కు డిమాండు కొనసాగుతూ వచ్చింది. ఇంతటి ప్రజాద]రణ కలిగిన ఈ రైలు ఇప్పటికీ నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘దారి’ తప్పిన మైసూర్- శిర్డి..
అనంతపురం మీదుగా వారానికి ఒక రోజు మైసూర్- శిర్డి రైలు(16217/18) నడిచేది. ఈ రైలు సోమవారం మైసూర్ నుంచి శిర్డీకి వెళ్లి బుధవారం రాత్రి శిర్డీ నుంచి మైసూర్కు వెళుతుంది. జిల్లాకు చెందిన బాబా భక్తులు ఈ రైలులో శిర్డీ వెళ్లడానికి వీలుగా ఉండేది. కరోనా తర్వాత ఈ రైలును తుముకూరు, బళ్లారి మీదుగా శిర్డీకి వెళ్లేలా దారి మార్పు చేశారు. అప్పట్లో పార్లమెంటు సభ్యులు ఈ రైలు పట్టాలెక్కలేదని అడిగితే బెంగళూరు- గుత్తి డబ్లింగ్ జరుగుతుండటంతో మార్పు చేశామని చెప్పారు. కానీ డబ్లింగ్ పనులు పూర్తి అవుతున్నాయి. అన్ని రైళ్లు అనంతపురం మీదుగా నడుస్తున్నా ఈ రైలు నడపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రైలును తుమకూరు, బళ్లారి మీదుగానే శాశ్వతంగా నడుపుతామని ఇప్పటికే రైల్వే అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతం హిందూపురం, అనంతపురానికి చెందిన భక్తులు శిర్డీ వెళ్లడానికి కేవలం బెంగళూరు సిటీ- న్యూదిల్లీ (12628-27) రైలు మాత్రమే ఉంది. ఈ రైలు కోపర్గావ్ దాకా వెళుతుంది. ఈ రైలులో సీట్లు దొరకాలంటే 4 నెలలు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. మరో రైలు చెన్నై-శిర్డీ వారంలో ఒక రోజు ఉన్నప్పటికీ ఈ రైలులో సీట్లు దొరకాలంటే 4 నెలలు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. కానీ ఇందులో కోటా తక్కువగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య!
[ 03-07-2024]
ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. -
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
-
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
-
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
-
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!