పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
వైకాపా పాలనలో రాయితీల ఎత్తివేత
అధిక విద్యుత్తు ఛార్జీలతో మూతపడిన ఐరన్, ఫార్మ కంపెనీలు
అధిక విద్యుత్తు ఛార్జీల భారంతో మూతపడిన మనస్వి ఫార్మ కంపెనీ
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దాదాపు ఐదు దఫాలు విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో ఈ భారం భరించలేక మెగా, పూర్వా స్టీల్స్, వేదిక్, ఇస్పాత్ ఐరన్ పరిశ్రమలు, మనస్వి ఫార్మ, రెడ్డి ల్యాబ్స్, రహుల్ బేరియం పరిశ్రమలు మూతపడ్డాయి. హిందూపురం ప్రాంతంలో గతంలో సూపర్ స్పిన్నింగ్ మిల్లులు ఉండటంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించిన నాటి శాసనసభ్యుడు ఎన్టీ రామారావు 1983లో వెయ్యి ఎకరాల్లో తూముకుంట పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వంద కిమీ దూరంలో ఉండటం, అవసరమైన అన్ని వసతులు అప్పటి ప్రభుత్వం కల్పించడంతో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తర్వాత 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో తూముకుంట పారిశ్రామికవాడ సమీపంలోని గోళ్లాపురం ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమి సేకరించటంతో ఇక్కడ కెమికల్, ఫార్మ, ఇతర కంపెనీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పారిశ్రామికవాడల్లో 185 చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి వల్ల స్థానికంగా, ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులు, ఇతరులు 20 వేలమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గత తెలుగుదేశం పాలనలో ఈ పారిశ్రామిక వాడను మరింత అభివృద్ధి చేసేందుకు కొటిపి వద్ద 800 ఎకరాల భూమిని సేకరించినా తర్వాత జరిగిన ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పరిశ్రమల ఏర్పాటు గురించి ఇసుమంత కూడా పట్టించుకోకపోవటంతో ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు.
తూముకుంట పారిశ్రామికవాడలో అభివృద్ధికి నోచుకోని అంతర్గత రహదారులు
ఐదేళ్లలో ఒక్క అడుగూ పడలేదు..
తెదేపా పాలనలో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, బీసీలకు 20, ఓసీలకు 15 శాతం రాయితీలు అందించడంతో ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఈ రాయితీలకు మంగళం పాడటంతో పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కరూ ముందుకు రాలేదు. పైగా విద్యుత్తు ఛార్జీలు అధికంగా పెంచడంతో ఉన్న పరిశ్రమలే నష్టాల బారినపడి మూతపడ్డాయి. పారిశ్రామిక వాడలో గత ఐదేళ్లలో ఒకే ఒక సీసీ రహదారి ఏర్పాటు చేశారు తప్ప ఇతర అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు.
కూటమి ప్రభుత్వంపై ఆశలు
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాయితీలు కల్పించి తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఆశపడుతున్నారు. తన తండ్రి పాలనలో ఏర్పాటైన పారిశ్రామికవాడను మరింత అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రణాళిక రూపొందించుకొన్నారు. తూముకుంట నుంచి సోమందేపల్లి వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!