ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది.
మూడేళ్ల బకాయిలు రూ.30.55 లక్షలు
కొత్తచెరువులో వారపు సంత
కొత్తచెరువు, న్యూస్టుడే: కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగిన నాలుగురోడ్ల కూడలి కావడంతో వారపు, దిన సంతలు, బస్టాండు మార్కెట్లలో సుంకం వసూలుకు ఏటా పోటీ తీవ్రంగా ఉంటుంది. పంచాయతీ పరిధిలోని సంతలకు బహిరంగ వేలం నిర్వహించడం సాధారణం. సర్పంచి, అధికారుల సమక్షంలో జరిగిన వేలాలు డిపాజిట్లు, హెచ్చుపాట రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అయితే వేలంలో పాల్గొనడానికి గుత్తేదారులు చెల్లిస్తున్న డిపాజిట్లు మాత్రమే ఖాతాకు చేరుతున్నాయి. వేలం తరువాత రెండు రోజుల్లో మిగిలిన మొత్తాలు చెల్లించాలని, లేదంటే మళ్లీ వేలం నిర్వహిస్తామని నోటీసుల్లో పేర్కొంటున్నా పాలకుల స్వార్థం కారణంగా అమలుకు నోచుకోవడం లేదు. ఇది గుత్తేదారులకు వరంగా మారింది. కార్యదర్శులు నామమాత్రంగా ఒకటి రెండుసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఏడాది గడువు ముగియడంతో గుత్తేదారులు ఇదే అవకాశమని ఎగవేతకు పాల్పడుతుండటంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. 2021-22లో వారపు సంతకు రూ.2,06,000 బకాయి పడినా అదే గుత్తేదారు 2022-23 బస్టాండు వేలంలో పాల్గొని మళ్లీ రూ.5,07,000 బకాయి పడటం కార్యదర్శి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా కనీసం పర్యవేక్షించి చర్యలు చేపట్టకపోవడం అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందనడానికి నిదర్శనగా నిలుస్తోంది.
వసూళ్లలో నిర్లక్ష్యం
2021-22లో వారపు సంత బకాయి రూ.2,06,000, దిన సంత రూ.21,000, బస్టాండు రూ.61,000, 2022-23లో వారపు సంత బకాయి రూ.2,76,000, బస్టాండు రూ.5,07,000, 2023-24లో వారపుసంత రూ.8,35,000, దిన సంత రూ.4,78,000, బస్టాండు రూ.6,71,000 బకాయి పడ్డారు. మూడేళ్లలో మూడు మార్కెట్ల నుంచి వేలంలో రూ.51.83 లక్షల ఆదాయం లభించింది. డిపాజిటు రూపంలో రూ.21.28 లక్షలు పంచాయతీ ఖాతా వేలం రోజే జమచేయగా రూ.30.55 లక్షలు నేటికీ వసూలు కాకపోవడం కార్యదర్శి నిర్లక్ష్యానికి నిదర్శనగా నిలుస్తోంది.
డిపాజిట్లు స్వాహా చేస్తున్నా..
2023-24లో వారపు సంతకు రూ.6 లక్షలు డిపాజిట్ చెల్లించి వేలంలో రూ.14.35 లక్షలకు పాడుకున్నారు. అలాగే దిన సంతకు రూ.3 లక్షలు చెల్లించి రూ.4.78 లక్షలు, బస్టాండుకు రూ.3 లక్షలు చెల్లించి రూ.6.71 లక్షలకు వేలం పాడారు. అయితే దిన సంత, బస్టాండ్ డిపాజిటు మొత్తాలను కార్యదర్శి స్వాహా చేయడంతో వారపు సంత డిపాజిటు మాత్రమే పంచాయతీ ఖాతాకు జమ చేశారు.
ఇళ్లకు వెళ్లి వసూలు చేస్తాం
మూడేళ్ల నుంచి మార్కెట్ల వేలం మొత్తాలు బకాయి పడ్డాయి. మూడు మార్కెట్ల బకాయిలు రూ.30.55 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ప్రతినెలా పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు నిధులు అవసరం. 2023-24 బకాయిల వసూలుకు మూడో నోటీసు ఇచ్చాం. బకాయిపడిన గుత్తేదారుల ఇళ్ల దగ్గరకు సిబ్బందితో వెళ్లి వసూలు చేయాలని నిర్ణయించాం.
సురేంద్రనాథరెడ్డి, ఇన్ఛార్జి కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు