మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు.
నేడు ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
కొల్లకుంట వడ్డె అంజినప్ప, తెదేపా జిల్లా అధ్యక్షుడు
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా కింద ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్, ఈ నెల రూ.4వేలు కలిపి రూ.7వేలు లబ్ధిదారులకు అందిస్తారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పరదాలు కట్టుకొని ప్రజలకు కనిపించకుండా పర్యటనటు చేశారని, నేడు సీఎం చంద్రబాబునాయుడు ప్రజలవద్దకే నేరుగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరిస్తున్నారన్నారు. యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తండ్రి బాటలో నడుస్తూ ప్రజాదర్బార్ చేపడుతున్నారని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఐదేళ్లు వైకాపా ప్రభుత్వ పాలనలో పజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అర్థమవుతోందన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం నుంచి కొనసాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వెంట ఇంటింటికీ అబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి సత్యకుమార్యాదవ్ పర్యటన నేడు
ధర్మవరం న్యూస్టుడే: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సోమవారం ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 9.30 గంటలకు బత్తలపల్లి మండలం వేల్పుమడుగు, 10 గంటలకు ధర్మవరం మండలం నాగలూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే ఉదయం 10.30 గంటలకు ధర్మవరం పట్టణంలోని 35వ వార్డు లక్ష్మీనగర్లో, 10.45 గంటలకు 36వ వార్డు కొత్తపేటలో, 11.15కు 6వ వార్డు శివానగర్లో, 11.30కు శంకరాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. శివానగర్ నాగులకట్ట వద్ద చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శారదానగర్లోని మంత్రి కార్యాలయానికి చేరుకుంటారని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య!
[ 03-07-2024]
ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. -
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
-
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!
-
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM