పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.
మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, న్యూస్టుడే: కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో పాటు గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. పింఛన్ల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఉదయాన్నే పార్టీ శ్రేణులు గ్రామ సచివాలయాల వద్దకు చేరుకుని, సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి, ఇంటింటా పింఛన్లను అందించేలా చూడాలన్నారు. వైకాపా అనుసరించిన విధానాలకు భిన్నంగా ముందుకు సాగుతూ లబ్ధిదారులకు ఇళ్ల వద్దే వాటిని పంపిణీ చేసి, ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు.
పాల్గొననున్న మంత్రి
పట్టణంలో సోమవారం నిర్వహించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నట్లు పార్టీ శ్రేణులకు చెప్పారు. పట్టణ నాయకులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆయన పాదయాత్రగా వెళ్తూ ఇంటింటా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బొకేలు, పూలదండలు లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనర్హులకు పింఛన్లు
[ 03-07-2024]
అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. -
సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం
[ 03-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 03-07-2024]
బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
తుంగభద్రకు పెరిగిన వరద
[ 03-07-2024]
తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. -
సీఈ, ఎస్ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ
[ 03-07-2024]
జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. -
ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే
[ 03-07-2024]
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. -
అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి
[ 03-07-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. -
వేలిముద్రలు తీసుకొని.. పింఛన్ సొమ్ము కాజేసి
[ 03-07-2024]
శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. -
కథ మారింది.. దశ తిరిగింది
[ 03-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. -
‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’
[ 03-07-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా
[ 03-07-2024]
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. -
ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం
[ 03-07-2024]
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్కుమార్కు సవాల్గా నిలుస్తున్నాయి. -
పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన
[ 03-07-2024]
తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం!
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు