logo

రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు

తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు.

Published : 01 Jul 2024 03:56 IST

బెంగళూరు రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వితరణ

స్నానపు గదులు, మరుగుదొడ్ల సముదాయాన్ని ప్రారంభిస్తున తెదేపా నాయకుడు రామ్మూర్తినాయుడు, బెంగళూరు వెల్ఫేర్‌ ట్రస్ట్‌ సభ్యులు

రామగిరి, న్యూస్‌టుడే : తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ ముత్యాలమ్మ దేవి బెంగళూరు రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ సహకారంతో రూ. 40 లక్షలతో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. వీటిని ఆదివారం ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమానికి రామ్మూర్తినాయుడు, ఈఓ వెంకటేశ్, మాజీ ఎంపీపీ పరంధామయాదవ్, తెలుగుయువత అధ్యక్షుడు లింగా శ్రీధర్‌ నాయుడు, నసనకోట ఎంపీటీసీ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై భవన సముదాయాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లతో మహిళ భక్తులు ఇబ్బందులు తొలగిపోతాయిని అన్నారు. బెంగళూరు రెసిడెంట్స్‌ స్ఫూర్తి అభినందనీయమన్నారు. ట్రస్టు ప్రతినిధులు సిటి మోహన్, నరసింహయ్య, లింగరాజు, చంద్రశేఖర్, అన్నప్ప, కార్తీక్, వేణుగోపాల్, ఆంజనేయులు, మంజునాథ, ఓబుళపతి, ప్రకాశ్, నాగప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని