పీఏబీఆర్లో ప్రమాద ఘంటికలు
ఉమ్మడి జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం తగ్గిపోయింది.
ఉమ్మడి జిల్లాకు నీటిసరఫరాపై నీలినీడలు
వైకాపా ప్రభుత్వ వైఫల్యమే కారణం
అడుగంటిన పీఏబీఆర్
ఉరవకొండ, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం తగ్గిపోయింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాకు నీటి సరఫరాపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. పీఏబీఆర్ నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు. ఆనకట్ట భద్రత నేపథ్యంలో 5 టీఎంసీల వరకు నిల్వ ఉంచుతూ వస్తున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా 2 టీఎంసీలకు మించి తుంగభద్ర జలాలు రాలేదు. ఇక్కడి నుంచి శ్రీరామరెడ్డి, సత్యసాయి, అనంత నగరపాలక సంస్థల నీటి పథకాలతో పాటు కూడేరు, ఉరవకొండ పథకాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా ఉమ్మడి అనంత జిల్లాలో సింహ భాగం మున్సిపాలిటీలకు, గ్రామాలకు నీరు అందుతున్నాయి.
నాటి మంత్రి నిర్వాకం..
గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి పీఏబీఆర్కు ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ఈ క్రమంలో జీడిపల్లి జలాశయం నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. అలా చేసి ఉంటే నీరు పుష్కలంగా ఉండేవి. కాని కృష్ణా జలాలను అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రాంతానికి తరలించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వైకాపా ప్రజా ప్రతినిధులు కనీసం నోరెత్తలేదు. పీఏబీఆర్లో నీటి నిల్వ తగ్గుతున్నా తమకేమీ తెలియదన్నట్లు ఉండిపోయారు. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడింది. అయినా ప్రజాప్రతినిధులు నీటి అవసరాన్ని గుర్తించకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయనకు జపం చేస్తూ కాలం గడిపారు.
ప్రస్తుతం 0.695 టీఎంసీలు
జలాశయంలో ప్రస్తుతం 0.695 టీఎంసీ మాత్రమే నిల్వ ఉన్నాయి. వాటిలో 0.361 టీఎంసీ వరకు వినియోగించడానికి ఆస్కారం ఉంది. మిగతా 0.334 టీఎంసీ డెడ్ స్టోరేజీ కింద ఉండిపోనుంది. ప్రస్తుతం తాగునీటి పథకాలకు 55 క్యూసెక్కులు, విద్యుత్తుకు 15 క్యూసెక్కులు వినియోగిస్తుండగా 25 క్యూసెక్కుల వరకు నీరు ఆవిరి అవుతున్నాయి. దానికితోడు జలాశయం గట్టు కింద భాగంలో లీకేజీల కారణంగా నీరు వృథా అవుతోంది. పడమటి గాలులు అధికంగా వీస్తుండటంతో నీటి ఆవిరి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో 30-40 రోజుల్లో డెడ్ స్టోరేజ్కు చేరుకోనుంది.
నీటి పథకాలపై ప్రభావం
పీఏబీఆర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటంతో తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అనంత నగరపాలక సంస్థకు చెందిన ఇంటెక్వెల్ వద్ద నీటి నిల్వ బాగా తగ్గింది. అక్కడి మోటార్లకు నీరు అందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు అదనంగా మరిన్ని పైపులను దించి నీటిని తోడుకుంటున్నారు. నిల్వ తగ్గే కొద్ది శ్రీరామరెడ్డి, సత్యసాయి, ఉరవకొండ, కూడేరు పథకాలకు నీరు అందడం భారం కానుంది.
తుంగభద్ర నిండితేనే..
పీఏబీఆర్కు నీరు సరఫరా కావాలంటే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నిండాలి. అప్పుడు హెచ్చెల్సీ ద్వారా తుంగభద్ర జలాలు ఈ జలాశయానికి తరలిస్తారు. ప్రస్తుతం తుంగభద్రలో నీటి నిల్వ ఆశాజనకంగా లేదు. అక్కడి నుంచి నీరు రావడం కష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులు అనుకూలించి, అంతా మంచి జరిగితే ఆగస్టు రెండో వారం నీరు విడుదలయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.