రూ.2 కోట్లు దారి మళ్లించి.. కాలువలను విస్మరించి
సమగ్ర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లను కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది.
ఆధ్యాత్మిక కేంద్రం కసాపురంలో మురుగు సమస్య
గత వైకాపా ప్రభుత్వ పాపమిది
కసాపురంలో అధ్వానంగా మురుగు కాలువ
గుంతకల్లు, న్యూస్టుడే : సమగ్ర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లను కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. ఫలితంగా కాలువల నిర్మాణం జరగలేదు. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేలాదిమంది భక్తులతోపాటు స్థానికులకు కసాపురంలో అవస్థలు తప్పడం లేదు. రోడ్డుమీద ప్రవహించే మురుగును దాటుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
కసాపురంలో దాదాపు 1500 ఇళ్లతో పాటు 2500 వరకు జనాభా ఉంది. రోజుకు 2 లక్షల లీటర్ల మురుగు వస్తుంది. చాలా వరకు మట్టి కాలువలు కావడంతో వాటిని శుభ్రం చేయడానికి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం కొలువుదీరడంతో సమగ్ర మురుగు కాలువ వ్యవస్థ అంశం తెరపైకి వచ్చింది.
గుంతకల్లు - కర్నూలు రోడ్డు పక్కన ప్రమాదకరంగా కాలువ గుంత
భూమి పూజకు పరిమితమైన పనులు
కసాపురంలోని మురుగు సులభంగా బయటకు వెళ్లడానికి అప్పటి తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులను ప్రారంభించడానికి మూడు సంవత్సరాల కిందట అప్పటి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభం కాలేదు. కేటాయించిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించడంతో పనులు అమలుకు నోచుకోలేదు. కసాపురం ఎగువ భాగంలో ఉండగా నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం లోతట్టులో ఉంది. ఫలితంగా మురుగంతా ఆలయానికి చెందిన స్థలంలోనే కాకుండా ఆలయానికి ఆనుకుని వెళుతోంది. కాలువలు సరిగా లేకపోవడంతో అందులో పడి గ్రామానికి చెందిన బాలుడు నాలుగేళ్ల కిందట మృతిచెందాడు. కాలువ గుంతకల్లు - కర్నూలు రోడ్డు మధ్య గుండా వెళ్తుంది. రోడ్డుపక్కన ఉన్న కాలువ ప్రమాదాలకు నిలయంగా మారింది. కొన్ని సమయాల్లో వాహనాలు కాలువలో ఇరుక్కుపోతున్నాయి.
వర్షం వస్తే నీరు, మురుగు రోడ్లపై జోరుగా ప్రవహిస్తుంది. మురుగు పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గ్రామస్థులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
కసాపురంలో మురుగు కాలువలను నిర్మించడానికి గతంలో ఇంజినీర్లు సర్వే చేసి పాయింట్లను గుర్తించారు. లోతైన కాలువలను నిర్మించాలనే అంశంపై ప్రణాళిక రూపొందించారు. రూ. 2 కోట్లతో చేపట్టే మురుగు కాలువల పనులు ప్రారంభం కాలేదు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభించే విధంగా చూడాలని కోరుతాం.
రామలింగప్ప, పంచాయతీ కార్యదర్శి, కసాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.