పామిడి.. వస్త్ర రంగం ఢీలాపడి
పామిడి వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా జిల్లాలో ఎంతో పేరుగడించింది. ఇక్కడ టైక్స్టైల్స్, రెడీమేడ్, కట్ పీˆస్ క్లాత్ దుకాణాలు దాదాపు 1000 ఉన్నాయి.
వ్యాపారం లేక వెల వెలబోతున్న దుకాణం
పామిడి, న్యూస్టుడే : పామిడి వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా జిల్లాలో ఎంతో పేరుగడించింది. ఇక్కడ టైక్స్టైల్స్, రెడీమేడ్, కట్ పీˆస్ క్లాత్ దుకాణాలు దాదాపు 1000 ఉన్నాయి. వీటిలో నైటీలు, చీరలు, ప్యాంట్లు, షర్టులు, ఇతర దుస్తులు అమ్మే దుకాణాలు ఉన్నాయి. వీటిపై కొన్ని వందల దర్జీ కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గతంతో ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. వైకాపా ప్రభుత్వంలో ప్రోత్సాహం కరవై వస్త్రవ్యాపార రంగం నిలువునా మునిగిపోయింది.
గతంలో లాభదాయకం
గతంలో వస్త్ర వ్యాపారం లాభదాయకంగా సాగింది. వ్యాపారానికి అనువైన ముడి సరకులు తక్కువ ధరకు అందుబాటులో ఉండేవి. రెడీమేడ్ దుస్తులు తయారీకి గిరాకీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలతో పాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరకును తరలించడంతో భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది. రేడీమేడ్ దుస్తుల తయారీ చాలా కుటుంబాలకు జీవనోపాధిగా మారింది. పామిడిలో ఎక్కడ చూసినా దర్జీ పనులు చేసే వారు ఎక్కువగా కనిపిస్తారు.
ప్రస్తుతం దయనీయం
కరోనా సమయంలో వస్త్ర వ్యాపారం పడిపోయింది. నెలల తరబడి వ్యాపారులు దుకాణాలను మూసివేయడంతో సరకు అమ్ముడుపోక నష్టాలు వాటిల్లి వందల దుకాణాలు మూతపడ్డాయి. సరకు నిల్వలు పేరుకుపోవడంతో పెట్టుబడి రాక తెచ్చిన పెట్టుబడికి వడ్డీలు, దుకాణాల బాడుగలు, పనిచేసే వారికి వేతనాలు చెల్లించలేక వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు ఇతర ప్రాంతాల వ్యాపారులు దుస్తులకు డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టడంతో నష్టాలు చవిచూశారు. వస్తు సేవల పన్ను వ్యాపారులను కలవరం పెడుతోంది.
ముడిసరకు ధర తగ్గించి ఆదుకోవాలి
వస్త్రాలకు సంబంధించి ముడిసరకు ధరలు తగ్గించాలి. అప్పుడే కుట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారికి, చిరు వ్యాపారులకు చేతి నిండా పని దొరకుతుంది. వ్యాపారులకు పెనుభారంగా మారిన జీఎస్టీని రద్దు చేస్తే వస్త్ర వ్యాపార రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది.
శ్రీనివాసరావు, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, పామిడి
వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు
ఒకప్పుడు పదిమందికి పని ఇచ్చే వ్యక్తిని నేడు కూలీగా జీవనం సాగిస్తున్నా. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం వ్యాపారులను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి చిరు వ్యాపారులను ప్రోత్సహించే దిశగా తక్కువ వడ్డీతో రుణాలు, సబ్బిడీ రుణాలు, పరికరాలను ఇవ్వాలి.
మహేంద్రకర్ రఘునాథ్రావు, చిరు వ్యాపారి, పామిడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రూ.125 కోట్లు..ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
-
భార్యలిద్దరు.. ‘మూడో పెళ్లి చేశారు’
-
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?