logo

‘ఎవరూ అధైర్య పడొద్దు’

తెదేపా కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా నిలబడతానని ఎమ్మెల్యే జేసీˆ అస్మిత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 29 Jun 2024 04:45 IST

తాడిపత్రి, న్యూస్‌టుడే : తెదేపా కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా నిలబడతానని ఎమ్మెల్యే జేసీˆ అస్మిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలోని జేసీ నివాసం నుంచి  సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మాట్లాడారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఆనందం కంటే పార్టీ గెలుపునకు కృషి చేసిన అనేక మంది తెదేపా శ్రేణులు జైలులో ఉన్నారనే బాధే ఎక్కువగా ఉందన్నారు. కష్టపడి అటు రాష్ట్రంలో ఇటు తాడిపత్రి నియోజకవర్గంలోనూ తెదేపా కూటమిని గెలిపించుకున్నామన్నారు. అందరం కలిసికట్టుగా అభివృద్ది చేసుకుందామన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెంచిన పింఛన్‌  సొమ్మును జులై 1న ఇంటి వద్దకు  సచివాలయ సిబ్బంది వచ్చి అందజేయనున్నారని తెలిపారు. 

జేసీ అస్మిత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని