అధికార బలం.. అవినీతికి ఊతం
గత వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన అవినీతి కార్యాకలాపాల్లో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వామ్యం ఉంటడమే.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు
రూ.1.20 కోట్లు నొక్కేసిన ఏఈ
వైకాపా ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి
పుట్టపర్తి, కొత్తచెరువు, న్యూస్టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన అవినీతి కార్యాకలాపాల్లో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వామ్యం ఉంటడమే. ఒక మండలంలో అవినీతికి పాల్పడటం.. మరో మండలానికి బదిలీ కావడం.. ఇలా ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా ఏఈ వ్యవహరించాడు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించకుండానే బిల్లులు స్వాహా అయ్యాయి. అవినీతి ఆరోపణలు బహిర్గతమై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా విచారణ చేపట్టిన దాఖలాలు లేవు. వైకాపా నాయకుల అండదండలతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. పెనుకొండ, నల్లమాడ, కొత్తచెరువు, ఓడీసీ మండలాల్లో హరిప్రసాద్రెడ్డి స్వాహాపర్వం యథేచ్ఛగా సాగింది. కొత్తచెరువు మండలంలో 6వేల బస్తాల సిమెంటు స్వాహా చేయడంతోపాటు లబ్ధిదారులకు అందాల్సిన దాదాపు వెయ్యి టన్నుల ఇసుక కూపన్లను పక్కదారి పట్టించిన వైనంపై ‘ఇవ్వకున్నా ఇచ్చినట్లు...అంతా కనికట్టు’ శీర్షికన 2022, మేలో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. అప్పట్లోనే అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చినా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఓడీసీ మండలంలో వైకాపా నాయకులు గృహాలు నిర్మించకుండానే బిల్లులు వారి ఖాతాలకు జమ చేసుకుని స్వాహా చేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాదాపు రూ.1.20 కోట్లు అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
పునాది వేసి.. ఇటుకలు ఇచ్చారు
నలుగురు పిల్లలు ఉన్నారు. తాత్కాలిక గుడారంలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాలుగేళ్ల క్రితం అప్పుడున్న ఏఈ ఇల్లు కట్టిస్తానని రూ.60 వేలు తీసుకున్నారు. పునాది వేసి సిమెంటు ఇటుకలు ఇచ్చారు. మూడేళ్లుగా ఏఈ కనిపించలేదు. ఎవరిని అడగాలో తెలియలేదు.
పూల వెంకటరమణమ్మ, కొత్తచెరువు
విధుల నుంచి తొలగించాం
గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్రెడ్డిని విధుల నుంచి తొలగించాం. ఇటీవల ఓడీసీ మండలంలో జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణంలో రూ.1.20 కోట్లు అవినీతికి పాల్పడినట్లు గుర్తించాం. కలెక్టర్ అరుణ్బాబుకు నివేదిక అందజేశాం. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెంకటనారాయణ, పీడీ, జిల్లా గృహనిర్మాణ శాఖ
రూ.95 వేలు ఇచ్చా
అనారోగ్యంతో ఉన్న భర్త, ఆరుగురు పిల్లల పోషణ భారం నాదే. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అదనంగా ఇస్తే ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.1.20 లక్షలతోపాటు అప్పుచేసి రూ.95 వేలు ఏఈకి ఇచ్చాను. పైకప్పు అయ్యాక ఆచూకీ లేకుండా పోయారు. మిగిలిన ఇంటి పని పూర్తి చేయలేదు.
నరసమ్మ, కూలీ, కొత్తచెరువు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
-
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా