పంచాయతీల్లో స్వచ్ఛత ఏదీ?
పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాన్న లక్ష్యంతో స్వచ్ఛభారత్ కింద వాహనాలను పంచాయతీలకు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవడంతో స్వచ్ఛ వాహనాలు మూలకు చేరాయి.
కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ సున్నగుట్టతండా సమీపాన రహదారిపై చెత్తాచెదారం
కదిరి, పుట్టపర్తి, న్యూస్టుడే: పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాన్న లక్ష్యంతో స్వచ్ఛభారత్ కింద వాహనాలను పంచాయతీలకు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవడంతో స్వచ్ఛ వాహనాలు మూలకు చేరాయి. దీంతో చాలా చోట్ల చెత్తసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. వీధులు అపరిశుభ్రతగా మారి, రహదారులపైన చెత్తదిబ్బల దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లు ఖర్చుచేసి పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులకు స్వచ్ఛభారత్ కింద వాహనాలు ఇచ్చారు. నిర్వహణతోపాటు కార్మికులకు వేతనాలు ఇవ్వక మూలనపడ్డాయి. కనీసం మరమ్మతులు చేయించకపోవడంతో వాహనాలు తుప్పుపట్టాయి. కొన్ని విడిభాగాలు అపహరణకు గురయ్యాయి. జిల్లాలో ఆరు ఆటోలు, 25 ట్రాక్టర్లు, 310 రిక్షాలు మరమ్మతులకు గురికావడంతో ఆపేశారు. వీటికితోడు వాహనాలను నడిపేందుకు 15మంది డ్రైవర్ల కొరత ఉంది.
తలుపుల: మేజర్ పంచాయతీ తలుపులలో రెండు ట్రాక్టర్లు, ఆటో, పది రిక్షాలు ఉన్నాయి. వాటిలో ఐదు ఆటోలను మూలనపెట్టారు. దీంతో అవి తుప్పుపడుతున్నాయి. మురుగు కాల్వల్లో పూడిక తొలగించే మినీ జేసీబీ నిరుపయోగంగా మారింది. రూ.లక్షల విలువైన జేసీబీని ఆరుబయట పడేశారు. ఫలితంగా పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది.
కదిరి గ్రామీణం: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి, పట్నంలో ఆటోలు మరమ్మతులకు వచ్చాయి. కుమ్మవాండ్లపల్లిలో ఆటో బ్యాటరీ అపహరణకు గురైంది. మొటుకుపల్లి, కాళసముద్రం డ్రైవర్లు లేక నిలిపేశారు. మండలంలోని 36 రిక్షాల్లో సగానికి పైగా మూలన పడేశారు. కొత్తగా మంజూరైన వాహనాలను వినియోగించకుండానే తుప్పుపడుతున్నాయి. దీంతో రోడ్లపై చెత్త, వీధుల్లోకి మురుగు చేరుతోంది.
వినియోగంలోకి తెస్తాం...
పలు పంచాయతీల్లో చెత్తసేకరణ వాహనాల్లో కొన్ని పని చేయడంలేదు. కొన్నింటికి డ్రైవర్ల కొరత ఉంది. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
విజయకుమార్, జిల్లా పంచాయతీ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే
-
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్