గత పాలకుల పాపం.. పురం పురోగతికి శాపం
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీని సర్వ నాశనం చేసింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా రద్దు చేసి, పురపాలికపై అదనపు భారం మోపింది.
హిందూపురం పట్టణం, న్యూస్టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీని సర్వ నాశనం చేసింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా రద్దు చేసి, పురపాలికపై అదనపు భారం మోపింది. హిందూపురం వాసుల 50 ఏళ్ల కల అయిన నూతన మార్కెట్ నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, ముఖ్యమైన రహదారి విస్తరణ, అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెదేపా ప్రభుత్వం అంకురార్పణ చేసి ముందుకు తీసుకెళ్తే వాటిని అస్తవస్త్యం చేసి పట్టణాభివృద్ధిని అటకెక్కించారు. ఈ పాపాలను సరి దిద్దడం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పాలకులకు పెద్ద సవాలుగా మారింది. నాలుగు నెలల తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.
పట్టణంలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.66 కోట్లతో రహదారులు, కాలువల నిర్మాణం, ఉద్యానవనాల ఏర్పాటు తదితర పనులు జరిగేలా చూశారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్న దశలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రద్దు చేసింది. ఐదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఇటీవలే మున్సిపల్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.83 కోట్లు అవసరమని నిర్ధారించారు. అంటే పనులు రద్దు చేయడంతో అదనంగా రూ.25 కోట్లు అవసరం అవుతోంది.
రైల్వే రోడ్డు విస్తరణ జరిగేదెలా..
పట్టణంలో రైల్వే రోడ్ విస్తరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తెదేపా హయాంలో తొలగించారు. విస్తరణ పనులు చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. రైల్వే రోడ్ను విస్తరిస్తామని ముందుకొచ్చిన వైకాపా ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది.
రూ.30 కోట్లతో నిర్మించిన మార్కెట్ వృథా..
పట్టణంలో రూ.30 కోట్లతో తెదేపా హయాంలో నూతన మార్కెట్ను పట్టణ నడిబొడ్డున 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. వేలం పాటలు వేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. అంతే మున్సిపాల్టీకి ఆదాయం చేకూర్చాల్సిన మార్కెట్ వైకాపా నాయకులకు కామధేనువుగా మారింది. గదుల కేటాయింపు నుంచి మార్కెట్లో చిన్నచిన్న పనులు చేయడం వరకు అన్నింటిలోనూ దండుకొన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.192 కోట్లతో నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టును నిర్మించారు. ఈ నీటిని పట్టణంలోని అన్ని ప్రాంతాలకు అందించేందుకు రూ.75 కోట్లతో అంతర్గత పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. రూ.100 కోట్లతో పనులు చేస్తామని చెప్పినా, ఆచరణలో అడుగు ముందుకు పడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!