న్యాక్ శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
ప్రస్తుత సమాజంలో యువత ఉపాధి పొందాలంటే సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న న్యాక్ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి
పీడబ్ల్యూ కార్యాలయ ఆవరణలోని గదుల సముదాయం
గుంతకల్లు, గుంతకల్లు గ్రామీణం, న్యూస్టుడే : ప్రస్తుత సమాజంలో యువత ఉపాధి పొందాలంటే సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న న్యాక్ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గుంతకల్లులో 2008 నుంచి న్యాక్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలక్ట్రిషియన్, ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్ తదితర విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ప్రైవేట్ కంపెనీల్లో వృత్తిపరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏడాది శిక్షణార్థులను రెండు బ్యాచ్లుగా విడదీసి 3 నెలలు పాటు శిక్షణ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి బ్యాచ్లో 80 శాతం మందికి ప్రైవేట్ కంపెనీల్లో 20 శాతం స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. శిక్షణ పొందిన యువత మెయిల్, శోభ డెవలపర్స్, బీఎస్సీపీఎల్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వంటి సంస్థల్లో ఉద్యోగులుగా చేరుతున్నారు. న్యాక్ నుంచి శిక్షణ పొందిన అభ్యర్థులు వేల సంఖ్యలో కొలువులు సంపాదించి జీవితాల్లో స్థిరపడ్డారు.
శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ల్యాబ్
వసతులు మెరుగుపడితే.. ప్రయోజనం
2019 కరోనా తరువాత న్యాక్ శిక్షణలో యువతకు భోజనం, వసతి కల్పన అవకాశం లేకుండా పోయింది. కరోనా నుంచి బయటపడి పరిస్థితులు మారడంతో తిరిగి న్యాక్ శిక్షణ తరగతులను 2021 నుంచి ప్రారంభించారు. తరగతుల నిర్వహణకు సరిపడా భవనాలు అందుబాటులో లేకపోవడంతో పట్టణంలోని పీడబ్ల్యూ కార్యాలయ ఆవరణలోని గదులను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆధునిక భవనాలు సమకూరితే గ్రామీణ, సూదూర ప్రాంతాల నుంచి శిక్షణ కోసం వచ్చే విద్యార్థులకు భోజన సదుపాయంతో పాటు, వసతి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోవడంలేదని శిక్షణార్థులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి యువత శిక్షణకు ఉపయోగకరంగా ఉండేలా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగం వచ్చింది
న్యాక్లో ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ తీసుకొన్నా. ప్రస్తుతం కర్ణాటకలోని గదగలోని మెయిల్ కంపెనీలో ఉద్యోగం పొందా. కంపెనీ నుంచి భోజనం, వసతి సదుపాయం కల్పించారు. ఉపాధి లభించడంతో జీవితం సంతోషంగా సాగుతోంది. నా కుటుంబానికి ఆ ఉద్యోగం ఎంతో ఆసరగా నిలిచింది.
శ్రీయువ కిరణ్, గుంతకల్లు
కొత్త పాలకులు దృష్టి సారించాలి
ప్రస్తుతం ఉన్న భవనాలను ఆధునీకరిస్తే శిక్షణ పొందడానికి వచ్చిన యువతకు సౌకర్యంగా ఉంటుంది. తరగతి గదుల్లో ఉన్న విలువైన సామగ్రి ఉంచడానికి కేంద్ర చిన్నగా ఉంది. కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
సుధాకర్, న్యాక్ కేంద్ర బాధ్యుడు, గుంతకల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం
[ 01-07-2024]
అనంత నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. -
ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం
[ 01-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. -
రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం
[ 01-07-2024]
కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. -
పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం
[ 01-07-2024]
వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఎగవేత పద్దుగా సంతల ఆదాయం
[ 01-07-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. -
మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. -
ఎండీయూలతోనే సరకుల పంపిణీ
[ 01-07-2024]
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. -
లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే
[ 01-07-2024]
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే అన్నారు. -
పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి
[ 01-07-2024]
కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. -
నారా లోకేశ్ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు
[ 01-07-2024]
డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. -
రూ.40 లక్షలతో స్నానపు గదుల ఏర్పాటు
[ 01-07-2024]
తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని తెదేపా నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు అన్నారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
[ 01-07-2024]
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
‘ఆసుపత్రి సూపరింటెండెంట్గా రోహిల్కుమార్ వద్దు’
[ 01-07-2024]
స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా గతంలో పనిచేసిన రోహిల్కుమార్ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..
[ 01-07-2024]
సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాబోతున్నారు. -
బడుగు జీవులకు కూటమి భరోసా
[ 01-07-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.