Anantapur: ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన తల్లి మృతి
తొలి కాన్పులోనే (ఇద్దరు మగ, ఓ ఆడ) ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి అస్వస్థతకు గురై మృత్యువాత పడిన ఘటన పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది.
కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సవిత
పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: తొలి కాన్పులోనే (ఇద్దరు మగ, ఓ ఆడ) ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి అస్వస్థతకు గురై మృత్యువాత పడిన ఘటన పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది. భర్త తెలిపిన వివరాల మేరకు.. మోటువారిపల్లికి చెందిన గిరిరాజుకు 2020, సెప్టెంబరు 18న కురుబవాండ్లపల్లికి చెందిన వెన్నెల(24)తో వివాహం జరిపించారు. ఆమె గత నెల 29న అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి అస్వస్థతకు గురైంది. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. బాలింత మృతిచెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. విషయం తెలుసుకొన్న మంత్రి సవిత గ్రామానికి వెళ్లి బాలింత మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం వచ్చినా.. అభివృద్ధి సున్నా
[ 07-07-2024]
గత వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. రైతు పక్షపాతినంటూ కోతలు కోసిన జగన్.. తన ఏలుబడిలో మార్కెటింగ్ శాఖను నిర్వీర్యం చేశారు. -
రేపటి నుంచి ఉచితంగా ఇసుక
[ 07-07-2024]
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెదేపా కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది. గడిచిన ఐదేళ్లూ ఇసుక దోపిడీ ఇష్టారాజ్యంగా సాగింది. -
లైంగిక వేధింపులపై ఉక్కుపాదం
[ 07-07-2024]
ఓ ప్రభుత్వ శాఖ జిల్లా కార్యాలయంలో మహిళా ఉద్యోగి పట్ల సహ ఉద్యోగి మానసికంగా వేధించడమే కాదు..లైంగికపరమైన వ్యాఖ్యలతో నిత్యం ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. -
ఆలోచన వినూత్నం.. ఆవిష్కరణ దిశగా మధనం
[ 07-07-2024]
సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభ్యసించే విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. -
కటకటాల్లోకి రైల్వే లంచావతారులు
[ 07-07-2024]
అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన గుంతకల్లు డీఆర్ఎం వినీత్సింగ్తోపాటు సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజరు ప్రదీప్బాబు, సీనియర్ డివిజనల్ ఇంజినీరు అక్కిరెడ్డి, కార్యాలయ ఇంజినీరింగ్ సెక్షన్ పర్యవేక్షణాధికారి బాలాజీ, మరో ఇంజినీరింగ్ అధికారి లక్ష్మీపతిరాజుతోపాటు సీఎన్ఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఎన్.రహంతుల్లా, రమేష్కుమార్రెడ్డి కటకటాలపాలయ్యారు. -
గైనకాలజీకి రెండు పీజీ సీట్లు మంజూరు
[ 07-07-2024]
ప్రభుత్వ వైద్యకళాశాల గైనకాలజీ విభాగానికి రెండు పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిందని ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. -
రూ.18 లక్షలకు తాళ్ల టెండర్
[ 07-07-2024]
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో శనివారం టెండర్ పక్రియ ముగిసింది. -
దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా
[ 07-07-2024]
గడచిన ఐదేళ్లలో అధికార పార్టీ అండదండలతో కబ్జాదారులు రెచ్చిపోయారు. తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
రేపటి నుంచి ఉచితంగా ఇసుక
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. -
కియా సహకారం..జీవనోపాధికి సోపానం
[ 07-07-2024]
కియా కార్ల పరిశ్రమ ప్రతినిధులు కార్పొరేట్, సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా ఆ పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి పెనుకొండ సమీపంలో టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
ఉరవకొండలో పోలీసుల అత్యుత్సాహం
[ 07-07-2024]
ఉరవకొండ పట్టణంలో పోలీసులు శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్రెడ్డి ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయానికి వచ్చారు. -
తీర్థయాత్రకు వెళుతున్న బస్సు బోల్తా
[ 07-07-2024]
అతివేగం.. ఆపై డ్రైవర్ నిద్రమత్తులో నడపడంతో తీర్థయాత్రలకు వెళ్తున్న బస్సు రహదారి పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!