జాగాలపై డేగలు..!
పేదలకు సెంటు భూమి ఇస్తామని ప్రైవేటు భూములను కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఆలస్యమనే వంకతో రెవెన్యూ అధికారుల కమిటీ ధర నిర్ణయించి రైతులకు నచ్చితే విక్రయించాలని అన్నారు. ఇలా వైకాపా నాయకులు ఇష్టారీతిన రేట్లు పెంచి రూ.కోట్లలో జనం సొమ్ము కాజేశారు.
నాడు పేదల స్థలాల పేరుతో రూ. 300 కోట్ల దోపిడీ
పంచుకున్న అధికారులు, వైకాపా నాయకులు
బందరు, పెనమలూరు, మైలవరం, గన్నవరంలలో భారీ అక్రమాలు
ఈనాడు, అమరావతి
పేదలకు సెంటు భూమి ఇస్తామని ప్రైవేటు భూములను కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఆలస్యమనే వంకతో రెవెన్యూ అధికారుల కమిటీ ధర నిర్ణయించి రైతులకు నచ్చితే విక్రయించాలని అన్నారు. ఇలా వైకాపా నాయకులు ఇష్టారీతిన రేట్లు పెంచి రూ.కోట్లలో జనం సొమ్ము కాజేశారు. భూసేకరణ చట్టం మేరకు రెండున్నర రెట్లు చెల్లించేవీలుంది. నాడు ఓ ముఖ్య రెవెన్యూ అధికారి ఒకరు ఈ అక్రమంలో చురుగ్గా వ్యవహరించారు.
ఆయా నియోజకవర్గాల్లో తెరముందు దళారులు.. రైతులతో బేరసారాలాడగా.. తెర వెనుక అధికారులు, నేతలు చక్రం తిప్పారు. ఇలా జిల్లామొత్తమ్మీద దోచేసిన సొమ్ము సుమారు రూ. 300 కోట్లు! అధికారులేమో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. తోట్లవల్లూరుకు చెందిన ఓ రైతు వద్ద అధిక మొత్తం కమీషన్ డిమాండ్ చేసిన అధికారిణి అనిశా వలకు చిక్కిన విషయం విదితమే. ఆనాడు వీరంతా నొక్కేసిన దాదాపు రూ. 300 కోట్లను తిరిగి రాబట్టే అవకాశం ఉందా? అన్న చర్చ నడుస్తోంది. రైతుల నుంచి కమీషన్లు దండుకున్న దళారులను కొన్ని జిల్లాల్లో రైతులు నిలదీస్తున్నారు. ఏకంగా ఓ మాజీ మంత్రి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- గుడివాడ శివారులో జగనన్న కాలనీ కోసమంటూ 77 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎకరాకు రూ. 51 లక్షల చొప్పున రైతులకు చెల్లించినట్టు దస్త్రాల్లో చూపించారు. వాస్తవానికి ఇక్కడ మార్కెట్ ధర రూ. 25 లక్షలే. రైతులకేమో రూ. 30 లక్షల చొప్పున చెల్లించి మిగిలింది అధికారపక్ష నాయకులు నొక్కేశారు. ఇలా రూ. 15.40 కోట్ల ప్రజల సొమ్మును మింగేశారు.
- విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామం పల్లతిప్పలో 50 ఎకరాలను కొన్నారు. మొదట అధికారులు ఎకరా ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించగా.. దళారులు జోక్యం చేసుకుని రూ. 70 లక్షలకు పెంచారు. .
- బాపులపాడు మండలంలో ఎకరా మార్కెట్ ధర రూ. 30 లక్షలు. కానీ.. రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల చొప్పున 20 ఎకరాలను కొనుగోలు చేశారు.
- పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరులో 5,471 మందికి స్థలాలిచ్చేందుకు 210 ఎకరాలను కొన్నారు. ఎకరా ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించడంతో చాలామంది రైతులు తమ భూములను అమ్మేందుకు ముందుకొచ్చారు. రూ. 5 లక్షలను ఖర్చుల కింద ఇవ్వాలని దళారులు ముందుగానే అనధికార ఒప్పందం కుదుర్చుకున్నారు. అధికారులు మాత్రం వారికి నచ్చినవారి భూములనే తీసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువ రూ. 25 లక్షలు. మార్కెట్ ధర రూ. 35 లక్షల వరకు ఉంది. అంటే 210 ఎకరాలకు రూ. 73.50 కోట్లు సరిపోతుంది. కానీ రూ. 157.50 కోట్లు చెల్లించారు. ఇందులో ఎకరానికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు అధికారులు, నాయకులు పంచుకున్నారు. దాదాపు రూ. 31.50 కోట్లు వారికి ముట్టింది.
- పల్లతిప్ప సమీపంలోనే మరో వంద ఎకరాలను కొనేందుకు దళారులు ఎకరానికి రూ. 70 లక్షల చొప్పున ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చి బేరాలు కుదిర్చారు.
- కంకిపాడు మండలంలో 18 ఎకరాల ప్రైవేటు భూమికి ఎకరా రూ. 80 లక్షల చొప్పున చెల్లించారు. ఇక్కడ మార్కెట్ ధర గరిష్ఠంగా రూ. 40 లక్షలుగా ఉంది. గంగూరు ఉప్పులూరు మధ్య 30 ఎకరాలను కొనుగోలు చేశారు.
- మైలవరం నియోజకవర్గంలో ఎకరాకు రూ. 26 లక్షల చొప్పున ఖరీదు చేశారు.
- బందురు నియోజకవర్గంలో సముద్రానికి కేవలం 500 మీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.
- విజయవాడ నగరంలోని పేదలకు వెలగలేరు, కొండపల్లి, వెదురుపావులూరు, కొంపావులూరు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కేటాయించారు.
దారి మళ్లిందంతాప్రజల సొమ్మే..
- అక్కడ ఎకరా మార్కెట్ ధర గరిష్ఠంగా రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలు...
- కానీ... నాటి వైకాపా ప్రభుత్వం చెల్లించింది రూ. 30 లక్షలు...
- ఎందుకింత అంటే.. పేదల ఇళ్ల కోసం భూసేకరణ ఆలస్యమవుతోందంటూ వంక చెప్పింది.
- ఇలా 150 ఎకరాలను కొనుగోలు చేసి... రూ. 45 కోట్లను చెల్లించింది.
- ఇందులో రూ. 22.50 కోట్లు రైతులకు వెళ్లగా.. మిగిలిందంతా దళారులు మింగేశారు.
- వారి వెనుక ఉన్నదెవరో కాదు..ఆనాటి ప్రజాప్రతినిధి. బందరు నియోజకవర్గంలోని కరగ్రహారంలో సాగిన కుంభకోణమిది...
- ఇలా దారి మళ్లిందంతా ప్రజల సొమ్మే.. ఇటు రైతులకు దక్కలేదు.. అటు ప్రభుత్వ పనులకూ ఉపయోగపడలేదు... మరి ఈ సొమ్మును ఇప్పుడు కక్కించగలరా?
ఉమ్మడి జిల్లాలో మంజూరైన పక్కా గృహాలు 1,74,256
జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన భూమి 1,859 ఎకరాలు
వెచ్చించిన సొమ్ము రూ. కోట్లలో 950
ఎకరానికి నేతలు, అధికారులు నొక్కేసింది రూ. లక్షల్లో 1520
ఇలా ఉమ్మడి జిల్లాలో దండుకున్నది రూ . కోట్లలో 300
అంతా రహస్యమే..
బందరులోని కరగ్రహారం లేఔట్
ప్రజాప్రయోజన కింద భూసేకరణ చేస్తే... ముందుగా నోటీసివ్వాలి. ప్రజాప్రయోజనం వివరించాలి. అభిప్రాయ సేకరణ జరపాలి. డ్రాఫ్ట్నోటిఫికేషన్, డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. నాటి వైకాపా ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. అంతా రహస్యంగా కానిచ్చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
‘పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు’
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
-
కుంతీ కుమారి.. ఓ కార్పొరేట్ ఆసుపత్రి.. గర్భస్థ శిశువు అవశేషాల కోసం వెతుకులాట
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/07/24)
-
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణకు జిష్ణు దేవ్ వర్మ
-
స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
అందానికి చీర కడితే మౌనీ.. అనుపమ కవ్విస్తూ చూడనీ..