గంజాయిపై ఉక్కుపాదం
పెరుగుతున్న గంజాయి వినియోగం, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు.
కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ ఏర్పాటు
జోనల్ స్థాయిలోనూ 3 బృందాలు
ఈనాడు - అమరావతి: పెరుగుతున్న గంజాయి వినియోగం, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. బుధవారం దీనికి అంకురార్పణ చేయనున్నారు. దీంతో పాటు జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని కూడా నియమించనున్నారు. విద్యాకేంద్రంగా ఎదిగిన విజయవాడ, పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం బాగా పెరిగింది. పోలీసుల కళ్లుగప్పి రవాణా అవుతోంది. ఏజెన్సీ నుంచి నగరానికి పెద్దఎత్తున చేరుతోంది. విద్యార్థులే విక్రేతలుగా మారే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో మత్తుకు యువత చిత్తు కాకుండా కాపాడేందుకు టాస్క్ఫోర్స్కు పోలీస్ కమిషనర్ రూపకల్పన చేశారు.
మత్తులో యువత చిత్తు: ఏజెన్సీ నుంచి స్మగ్లర్లు బస్సుల్లో రవాణా చేస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో అయితే తనిఖీలు ఉంటాయని ఈ మార్గంలో ఎక్కువగా బెజవాడ చేరుతోంది. ప్రత్యేకంగా సమాచారం ఉన్న సందర్భాల్లోనే పోలీసులు తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అధిక సందర్భాలలో నిఘా గప్పి వస్తోంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు పలువురు స్వయంగా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి కొని నగరానికి తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో గంజాయి అమ్ముతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది వీరే కావడం గమనార్హం. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి రెండు నుంచి ఐదు కిలోల వరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తీసుకువస్తున్నారు. వాటిని తిరిగి చిన్న పొట్లాలుగా చేసి, ఒక్కొక్కటి రూ.100 కు విక్రయిస్తున్నారు. కేజీ రూ.వెయ్యికి కొని.. ఇక్కడ రూ.5 వేల చొప్పున అమ్ముతున్నారు.
ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు: కమిషనరేట్ స్థాయిలో ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లతో 12 మంది సభ్యుల టాస్క్ఫోర్స్ ఏర్పాటు అవుతోంది. ఇందులో లా అండ్ ఆర్డర్, కమిషనర్ టాస్క్ఫోర్స్, సాంకేతిక విభాగాలకు చెందిన వారిని నియమించనున్నారు. ఇందులో సభ్యులు స్థానిక బృందాల సమన్వయంతో రవాణా, సరఫరా మార్గాలపై దృష్టి సారించి, వాటి మూలాల వరకు వెళ్లి కీలక వ్యక్తుల ఆటకట్టించే దానిపై దృష్టి పెట్టనున్నారు. టాస్క్ఫోర్స్కు తోడ్పాటు అందించేందుకు జోనల్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి. కమిషనరేట్లో తూర్పు, పశ్చిమ, గ్రామీణ జోన్ల పరిధిలో పనిచేసేందుకు మూడు బృందాలు పని చేయనున్నాయి. స్థానికంగా విద్యాసంస్థల వద్ద నిఘా పెట్టడం, సరఫరా, అమ్మకాలపై దృష్టి సారించి నిందితుల గురించి సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
‘పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు’
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.